విశాలాంధ్ర -ధర్మవరం :: బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వైయస్ రాజశేఖర్ రెడ్డి అని మున్సిపల్ చైర్మన్ కాచర్ల లక్ష్మీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలోనూ, పాండురంగ స్వామి గుడి దగ్గర గల వైయస్సార్ విగ్రహం వద్ద ఘనంగా జయంతి వేడుకలను వార్డు కౌన్సిలర్లు, మాజీ వైస్ చైర్మన్లు, కోఆప్షన్ నెంబర్లు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయం వద్ద గల వైఎస్ఆర్ విగ్రహానికి, పాండురంగ స్వామి గుడి వద్ద గల వైయస్సార్ విగ్రహానికి, కొత్తపేటలోని వైయస్సార్ విగ్రహం,మున్సిపల్ చైర్మన్ తో పాటు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్లు చంద్రమూరి నారాయణరెడ్డి, మాసపల్లి సాయికుమార్ ,భాగ్యలక్ష్మి, 40 వార్డుల కౌన్సిలర్లు పాల్గొని విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మున్సిపల్ వైస్ చైర్మన్ కాచర్ల లక్ష్మి, మాజీ వైస్ చైర్మన్ చందమూరి నారాయణరెడ్డి తదితరులు మాట్లాడుతూ సకల జన బాంధవుడు, అపర భగీరథుడు రాజశేఖర్ రెడ్డి అని, వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసే నాటికి రాష్ట్రంలో పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయని, వాటిని గుర్తించి వారి హయాంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు. అన్ని వర్గాల వారికి, రాజకీయ పార్టీలకు అతీతంగా ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలను అందించిన మహనీయుడని తెలిపారు. దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రజల కొరకు పాదయాత్ర చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలబడిపోయారని తెలిపారు. వారిని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా చేసుకొని, వారి ఆశయ సాధనాల కొరకు కృషి చేయాలని తెలిపారు. వ్యవసాయానికి ముఖ్యమైన నీటిని అందించడానికి జలయజ్ఞం కూడా ప్రారంభించడం జరిగిందన్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పథకం నేడు ఆంధ్రప్రదేశ్ కాకుండా ఇతర రాష్ట్రాలకు ఆదర్శ మైనదని తెలిపారు. అటువంటి తండ్రికి జన్మించిన నేటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ నేడు రాష్ట్రంలోనే ఉత్తమ ముఖ్యమంత్రిగా నిలవడం జరిగిందన్నారు. అంతేకాకుండా స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేయడం జరిగిందన్నారు. నేడు నియోజకవర్గ ప్రజలు కూడా కేతిరెడ్డికి మద్దతు పలుకుతున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలు అనే పథకం పేద ప్రజలకు వరంలా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ చైర్మన్లు భాగ్యలక్ష్మి, మాసపల్లి సాయికుమార్ పెనుజూరు నాగరాజు, కౌన్సిలర్లు గజ్జల శివ, వెంకటరాముడు, బ్రహ్మయ్య ఆచారి, నీలూరు వెంకటరాముడు, మేడాపురం వెంకటేష్, కెతా లోకేష్, దాసు నాయక్, నాయకులు సుభాన్ భాష, చాంద్ భాషా, తదితర కౌన్సిలర్లు ఇన్చార్జ్ నాయకులు అధిక సంఖ్యలో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.