Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

మిడుతూరులో లాకప్‌ డెత్‌?

. ముచ్చుమర్రి హత్యాచారం కేసులో కీలక మలుపు
. దర్యాప్తు బృందానికి గట్టి దెబ్బ
. మృతుడి ముఖంపై, శరీరంపై గాయాలు
. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు
. నంద్యాల పోలీసుల్లో అలజడి

విశాలాంధ్ర – నంద్యాల: నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో బాలిక హత్యాచారం కేసులో దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. దర్యాప్తు చేస్తున్న పోలీసులకు ముచ్చెమటలు పట్టే సంఘటన జరిగింది. పోలీసుల అదుపులో ఉన్న ఓ అనుమానితుడు పోలీసు స్టేషన్‌లోనే మృతి చెందాడు. ఈ స్థితిలో పోలీసుల మెడకు లాకప్‌ డెత్‌ ఉచ్చు బిగిసింది. అనుమానితుడు ఆత్మహత్య చేసుకున్నాడా? లేక పోలీసుల థర్డ్‌ డిగ్రీ ప్రయోగంతో చనిపోయాడా? అనే విషయాన్ని పక్కన పెడితే… అనుమానితుడి మరణం మాత్రం లాకప్‌ డెత్‌ కేసుగా మారటం ఖాయమని పోలీసుల్లో అలజడి రేగింది. వివరాలు ఇలా ఉన్నాయి. ముచ్చుమర్రి ఘటనకు సంబంధించి బాలిక మృతదేహాన్ని మాయం చేసేందుకు ముగ్గురు మైనర్లకు సహకరించిన నలుగురు కుటుంబ సభ్యులను మూడు రోజుల కిందట పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఇక బాలిక మృతదేహం జాడ కోసం పోలీసుల విచారణ కొనసాగుతోంది. నిందితుల్లో ఒకరి మేనమామ హుస్సేన్‌ అలియాస్‌ యోహానయ్యను క్రైమ్‌ బృందం అదుపులోకి తీసుకొని మిడుతూరు పోలీసుస్టేషన్‌కు తరలించింది. మూడు రోజులుగా ఆ స్టేషన్‌లోనే క్రైమ్‌ బృందం విచారణ చేస్తోంది. అయితే శనివారం తెల్లవారు జామున మిడుతూరు పోలీసు స్టేషన్‌లో అతను చనిపోయాడు. విచారణ పేరుతో పోలీసులు తీవ్రంగా హింసించడం వల్లే అతను చనిపోయినట్లు కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మృతుడి ముఖంపైన, శరీరం పైనా గాయాలున్నట్టు అతని బంధువులు ఆరోపిస్తున్నారు. మృతదేహాన్ని నంద్యాల జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు అక్కడ యోహానయ్య మృతదేహం వద్దకు మీడియాను వెళ్లనివ్వలేదు. సాయంత్రం వరకు యోహానయ్య బంధువులు ఎవరూ రాకపోవడంతో బేరసారాలు సాగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని పోలీసులే మిడుతూరు గ్రామానికి తీసుకువెళ్లారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి మృతదేహాన్ని పరిశీలించడానికి ప్రభుత్వ ఆసుపత్రికి రావడంతో అక్కడ మృతదేహం కనపడకపోవడంతో మీడియాతో మాట్లాడుతూ సంఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసును సీబీఐ లేదా సీబీసీఐడీకి అప్పగించాలని డిమాండ్‌ చేశారు. ఈ రోజు ఒకరు మృతి చెందారని రేపు మరొకరు మృతి చెందరని గ్యారెంటీ ఏమిటని ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఆందోళన వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img