Monday, May 20, 2024
Monday, May 20, 2024

మీరాబాయి చానుకు సీఎం జగన్‌ అభినందనలు

టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకాన్ని అందించిన వెయిట్‌ లిఫ్టర్‌ మీరాబాయి చానుకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు.‘ ఒలింపిక్స్‌లో భారతదేశం పతకం సాధించడం చాలా ఆనందంగా ఉంది. 49 కిలోల వెయిట్‌ లిఫ్టింగ్‌ విభాగంలో రజత పతకం సాధించినందుకు మీరాబాయి చానుకి హృదయపూర్వక అభినందనలు’ అని ట్వీట్‌ చేశారు. భారత స్టార్‌ వెయిట్‌ లిఫ్టర్‌ మీరాబాయి చాను శనివారం వీరోచిత ప్రదర్శనతో రజత పతకాన్ని సాధించింది. 49 కిలోల వెయిట్‌ లిఫ్టింగ్‌ విభాగంతో రజత పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా మీరాబాయి చరిత్ర సృష్టించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img