Sunday, May 19, 2024
Sunday, May 19, 2024

‘ఇండియా’తోనే రాజ్యాంగ పరిరక్షణగుజ్జుల : ఈశ్వరయ్య

విశాలాంధ్ర-రాజంపేట: ఇండియా కూటమి బలపర్చిన రాజంపేట అసెంబ్లీ సీపీఐ అభ్యర్థి బుక్కే విశ్వనాథ నాయక్‌ను విజయం కోసం మంగళవారం బోయినపల్లి, చెర్లోపల్లె, మునక్కాయ పల్లె తదితర గ్రామాలలో సీపీఐ రాష్ట్ర కార్య దర్శివర్గ సభ్యులు గుజ్జుల ఈశ్వరయ్య విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈశ్వరయ్య మాట్లాడుతూ దేశంలో అంబేద్కర్‌ రచించిన రాజ్యాంగం సుస్థిరంగా ఉండాలంటే ఎన్డీఏ కూటమి పక్షాలు, వైసీపీకి ఓటు వేయొద్దని విజ్ఞప్తి చేశారు. ఇండియా కూటమితోనే రాజ్యాంగ పరిరక్షణ సాధ్యమవుతుందన్నారు. గత పది సంవత్సరాలుగా దేశంలో మనువాద సిద్ధాంతాన్ని చొప్పిస్తున్న మోదీ సర్కారును గద్దె దించాలన్నారు. లేదంటే ఈసారి రాజ్యాంగాన్ని లేకుండా చేస్తారన్నారు. అధికార దాహంతో దేశ ప్రజల మధ్య విద్వేషాలు సృష్టిస్తున్నారన్నారు. అలాంటి వారికి ఓటు అనే వజ్రాయుధంతో ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. అనునిత్యం ప్రజా పోరాటాలతో సమస్యలపై రాజీలేని పోరాటాలు చేస్తున్న బుక్కే విశ్వనాథ్‌ నాయక్‌ను రాజంపేట నుంచి గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి పీఎల్‌ నరసింహులు, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.శివరామకృష్ణదేవరా, జ్యోతి చిన్నయ్య జిల్లా సమితి సభ్యురాలు నాగమ్మ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img