పేదలకు ఉచితంగా పంపిణీ
దేశవ్యాప్తంగా టమాటాల ధరలు భారీగా పెరిగాయి. ఏపీలో కూడా రేట్లు అదిరిపోతున్నాయి.. దీంతో ప్రభుత్వం రూ.50కే సబ్సిడీపై అందిస్తోంది. అయితే అంతకంటే తక్కువగా రూ.30 కేజీ టమాటాలు అంటూ బంపరాఫర్ ప్రకటించారు. పెరిగిన టమాట రేటుతో పేదలు పడుతున్న ఇబ్బందులు గుర్తించిన తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విజయవాడలో టమాట రేటు తగ్గేంతవరకు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పేద ప్రజలకు కేజీ రూ.30కే టమాటాలను అందిస్తున్నారు. వన్టౌన్ రథం సెంటర్లో ఆయన తన సొంత నిధులతో తోపుడుబండిపై టమాటాలను తీసుకువచ్చి పేదలకు ఉచితంగా పంపిణీ చేశారు. ధరలు దిగొచ్చేదాకా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కిలో టమాటా రూ.30కే ప్రతిరోజూ 500 కిలోలు పంపిణీ చేయనున్నట్లు వెంకన్న తెలిపారు. అంతేకాదు పేదలకు ఉచితంగా పంపిణీ చేస్తామని తెలిపారు. మిగతావారికి కిలో రూ.30కే అందజేస్తున్నామన్నారు. సామాన్య, మధ్యతరగతి ప్రజలు కొనలేని స్థితిలో టమాటా ధరలు ఉన్నాయన్నారు. నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. వాలంటీర్ వ్యవస్థపై ఎంతో గొప్పగా చెబుతున్న సీఎం జగన్.. వారి ద్వారా ఇంటింటికీ రెండు కిలోల టమాటాలను సబ్సిడీ ధరకే సరఫరా చేయాలని సూచించారు.