అలిపిరి బాటలో ఓ చిన్నారిపై చిరుత దాడిని మరువక ముందే మరోసారి వాటి సంచారం భక్తులకు భయాందోళనలు కలిగిస్తోంది. ఘాట్ రోడ్డులోని 56వ మలుపు వద్ద బుధవారం సాయంత్రం అటుగా వెళ్తున్న భక్తులకు చిరుత కనిపించింది. అయితే వెంటనే అప్రమత్తమైన అటవీశాఖ, విజిలెన్స్ అధికారులు జీఎన్సీ వద్ద వాహనదారులను గుంపుగా పంపిస్తున్నారు. అలాగే ఆ చిరుతను దారి మళ్లించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.