హైదరాబాద్: భారతదేశంలో ప్రీమియం కార్ల తయారీలో అగ్రగామి హోండా కార్స్ ఇండియా మరింత మెరుగైన లుక్స్, ప్రీమియం ఎక్స్టీరియర్స్ స్టైలింగ్ మరియు విలాస వంతమైన ఇంటీరియర్లు కలిగిన న్యూ అమేజ్ను విడుదల చేసింది. ఈ ‘ఠీవైన’ న్యూ అమేజ్, సగర్వమైన జీవితాన్ని జీవించే స్ఫూర్తికి నిలువెత్తు ప్రతిరూపంగా నిలుస్తుంది, తన సరికొత్త రూపంలో ఒక పూర్తి సరికొత్త వైఖరిని, తాజా భరోసాని ప్రతిబింబిస్తుంది. ఈ ప్రీమియం ఫ్యామిలీ సెడాన్, మాన్యువల్ మాత్రమే కాక సివిటి ట్రాన్స్మిషన్లలో పెట్రోల్, డీజిల్ ఇంజన్లలో లభిస్తుంది. ఒక సరికొత్త రంగు మెటియొరాయిడ్ గ్రే మెటాలిక్ రంగును శ్రేణిలో చేర్చటం జరిగిందని హోండా కార్స్ ఇండియా ప్రెసిడెంట్, సిఇఒ గాకు నకనిషి అన్నారు.