నోయిడా: అంతర్జాతీయ కోస్తా పరిశుభ్రతా దినోత్సవం 2023 సందర్భంగా భారతదేశంలో హెచ్సీఎల్ టెక్ కార్పొరేట్ సామాజిక బాధ్యత ఎజెండాను అందించే హెచ్సీఎల్ ఫౌండేషన్ పెద్ద ఎత్తున, కమ్యూనిటీచే ప్రోత్సాహించబడిన కోస్తాను పరిశుభ్రం చేసే కాంపైన్ను చేపట్టింది. ఈ చొరవ ఆరు రాష్ట్రాలలో `ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిశ్సా, కేరళ, పశ్చిమ బెంగాల్, కర్ణాటకలలో చేపట్టింది. భారతదేశపు కోస్తా, సముద్ర వాతావరణాలను కాపాడి, సంరక్షించే సహకారంలో పాల్గొనడానికి వేలాదిమంది వలంటీర్లను సమీకరించింది, వారు వివిధ ప్రదేశాలలో 18,485 కిలోల వ్యర్థాలను సేకరించారు. అంతర్జాతీయ కోస్తా ప్రాంతం పరిశుభ్రతా దినోత్సవాన్ని అంతర్జాతీయంగా సెప్టెంబర్ మూడవ శనివారం అనుసరిస్తునారు. కాలుష్యం, అవశేషాల నుండి సముద్ర ఆవరణ వ్యవస్థలను కాపాడటానికి ఇది సమాజాలను ఒక చోట చేరుస్తోంది.