ముంబయి: ఫోన్పే పేమెంట్ గేట్వే ఈరోజు తన రెఫరల్ ప్రోగ్రామ్ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఆన్లైన్ వేదికగా బిజినెస్ వృద్ధికి సహాయపడే వారి కోసం ఫోన్పే పీజీ పార్ట్నర్ ప్రోగ్రామ్ను రూపొందించింది. రెఫరల్ పార్ట్నర్గా ఉన్న వ్యక్తి, తన క్లయింట్లను సంప్రదించి, కస్టమర్ల నుండి ఆన్లైన్ పేమెంట్లను యాక్సెప్ట్ చేయమని, బిజినెస్ వృద్ధిని పెంచుకోమని వారికి సూచించవచ్చు. ఈ ప్రోగ్రామ్ ద్వారా ఇండస్ట్రీలోనే అత్యంత ఉత్తమమైన కమీషన్ రేట్లలోని ఒక రేటును బిజినెస్లకు అందిస్తుంది. ఈ రేటు వారి రెఫరల్ ఆదాయాలను గణనీయంగా పెంచడంలో సహాయపడే ప్రతి లావాదేవీకి వర్తిస్తుంది. వ్యాపార సంస్థలు తమ మర్చంట్లకు అత్యుత్తమ పేమెంట్ సొల్యూషన్స్ను అందించడం కోసం ఫోన్పే పీజీ పార్ట్నర్ ప్రోగ్రామ్లో చేరవచ్చు. ఈ భాగస్వామ్యం విశ్వసనీయతను పెంచుతుంది, అలాగే క్లయింట్లు ఇష్టపడే వెండర్గా బిజినెస్లు గుర్తింపు సాధించడంలోనూ సహాయపడుతుంది. అంతేగాక నమ్మకాన్ని పెంపొందించి, బిజినెస్ విస్తరణకు తోడ్పడుతుంది.