కరీంనగర్: కరీంనగర్ లోని 93 మంది తమ మొదటి బ్యాచ్ విద్యార్థులు కోసం శామ్సంగ్ ఇండియా తమ ఫ్లాగ్ షిప్ ప్రోగ్రాం ‘శామ్సంగ్ ఇన్నోవేషన్ క్యాంపస్’ కోడిరగ్ అండ్ ప్రోగ్రామింగ్ కోర్స్ను ముగించింది. తమ మిషన్లో భాగంగా దేశంలోని యువతకు, పవరింగ్ డిజిటల్ ఇండియాకు సాధికారత కలిగించడానికి భారతదేశపు శక్తివంతమైన భాగస్వామిగా, ప్రభుత్వంతో పాటు కలిసి పని చేస్తూ శామ్సంగ్ వారి నిబద్ధతను పునరుద్ఘాటించింది. కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఆర్స్ట్ అండ్ సైన్స్లో విద్యార్థులకు శిక్షణ ఇవ్వబడిరది. నిపుణుల సలహాలు పొందారు. ఒక సన్మాన కార్యక్రమంలో కోర్స్ను పూర్తి చేసిన సర్టిఫికెట్స్ అందచేసారు. శామ్సంగ్ అండ్ ఎలక్ట్రానిక్స్ సెక్టర్స్ స్కిల్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధికారులు విద్యార్థులకు సన్మానం చేసారు. ఆమోదించిబడిన శిక్షణ మరియు విద్యా భాగస్వాములు ద్వారా ప్రోగ్రాంను సంస్థ అమలు చేసింది.