విశాలాంధ్ర/హైదరాబాద్: అపోలో మైక్రో సిస్టమ్స్ లిమిటెడ్, ఇంజీనియస్ డిఫెన్స్ సిస్టమ్స్ (ఐపిఐడిఎస్) కోసం ఇంటిగ్రేటెడ్ ప్లాంట్కు శంకుస్థాపన చేయనున్నట్లు సంస్థ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో కమ్యూనికేట్ చేసినట్లుగా, ఇప్పటికే కేటాయించిన 2.5 ఎకరాల భూమికి ప్రక్కనే ఉన్న అదనంగా 2.5 ఎకరాల భూమి కోసం దరఖాస్తు చేయబడిరదని ధృవీకరించడానికి మేము సంతోషిస్తున్నామన్నారు.ఈ 5.00 ఎకరాల భూమిని ఇంటిగ్రేటెడ్ ప్లాంట్ ఫర్ ఇంజీనియస్ డిఫెన్స్ సిస్టమ్స్ (ఐపిఐడిఎస్) స్థాపనకు వినియోగించబడుతుందన్నారు. ప్రతిపాదిత పెట్టుబడి మొత్తం రూ. 210 కోట్లు. అపోలో మైక్రో సిస్టమ్స్ లిమిటెడ్ మా ఇంటిగ్రేటెడ్ ప్లాంట్ ఫర్ ఇంజీనియస్ డిఫెన్స్ సిస్టమ్స్ (ఐపిఐడి ఎస్) కోసం శంకుస్థాపన కార్యక్రమాన్ని 19వ తేది హైదరాబాద్లోని హార్డ్వేర్ పార్క్ లో నిర్వహించినట్లు ప్రకటించడానికి మేము సంతోషిస్తున్నామనన్నారు. .31 డిసెంబర్ 2023తో ముగిసిన త్రైమాసికంలో (కాన్స్), కంపెనీ ఆదాయాలు రూ. 9184 లక్షలు. పిఎటి రూ. 996.38 లక్షలు, ఆరోగ్యకరమైన వృద్ధి సంవత్సరంగా వివరించారు.