ముంబయి: గ్లోబల్ టెక్నాలజీ బ్రాండ్ షవోమి ‘ఏ’ సిరీస్లో తన తాజా స్మార్ట్ఫోన్ రెడ్మి ఏ3 ఇప్పుడు భారతదేశంలో విడుదలైంది. రూ.6,999 ప్రారంభ ధరలో అందుబాటులోకి వచ్చింది. రెడ్మి ఏ3 శక్తివంతమైన పనితీరుతో అద్భుతమైన డిజైన్ సౌందర్యాన్ని మిళితం చేస్తూ, వినియోగదారులకు ప్రీమియం స్మార్ట్ఫోన్ అనుభవాన్ని అందిస్తోంది. రెడ్మి ఏ3 తన కేంద్రకంలో ప్రీమియమ్ హాలో డిజైన్ను కలిగి ఉంది. గ్లాస్ ఫినిషింగ్, విలాసవంతమైన లెదర్-టెక్చర్డ్ మెటీరియల్ అనే రెండు సున్నితమైన ఎంపికలు ఉన్నాయి. ఇది ఒక పెద్ద 17.04 సెం.మీ (6.71’’) ఎల్సీడీ డాట్ డ్రాప్ డిస్ప్లే, 1650I720 రిజల్యూషన్ని కలిగి ఉంది. స్మార్ట్ఫోన్లో ప్రత్యేకమైన 90హెడ్జ్ రిఫ్రెష్ రేట్తో పాటు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 రక్షణను కలిగి ఉంది. సురక్షితమైన సైడ్ ఫింగర్ప్రింట్ ఫీచర్తో వస్తుంది.