హైదరాబాద్ : సూపర్స్టార్ మహేశ్ హీరోగా పరశురాం దర్శ కత్వంలో రూపొందుతోన్న భారీ చిత్రం ‘సర్కారువారి పాట’. భారీ అంచనాలతో రూపొందుతోన్న ఈ చిత్రం టీజర్ సోమవారం మహేశ్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. దీంతో చిత్రంపై భారీ అంచనాలు ఆకాశాన్నంటాయి. ఈ చిత్రంలో మహేశ్ లుక్ చాలా స్టైలిష్గా ఉంది. మ్యూజిక్ సెన్సేషనల్ ఎస్.ఎస్.తమన్ అద్భుతమైన బ్యాగ్రౌండ్ స్కోర్ను అందించాడు. అమేజింగ్ యాక్షన్ సీక్వెన్స్లతో బ్లాస్టర్ ఎక్స్పీరియెన్స్ను నెక్ట్స్ లెవల్కు తీసుకెళ్లారు. మహేశ్ అందాన్ని చూసి ప్రేక్షకులు ఎలా ముగ్దులవుతున్నారో, హీరోయిన్ కీర్తిసురేశ్ కూడా అలాగే ఫీలైంది. వెన్నెల కిశోర్ పాత్రతో సినిమాలో నవ్వులకు కొదవుండదని టీజర్లో టచ్ ఇస్తూ టీజర్ చివరలో మహేశ్ తనదైన ట్రేడ్ మార్క్ స్టైల్లో వేసిన కామెడీ పంచ్ ప్రేక్షకాబి మానులను ఆనందంలో ముంచెత్తింది. సంక్రాంతి పండుగ కానుకనగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నది. ప్రస్తుతం సినిమా షూటింగ్ హైదరాబాద్లో శరవేగంగా జరుగుతోంది.