విశాలాంధ్ర- ఉంగుటూరు ( ఏలూరు జిల్లా): ఉంగుటూరు మండలం నీలాద్రిపురం రహదారి మలుపుల వద్ద ఆదివారం అర్ధరాత్రి ఆటో అదుపుతప్పి బోల్తా పడి దుర్ఘటనలో 8 మంది మహిళలు స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉంగుటూరు గ్రామానికి చెందిన మహిళలు నల్లజర్ల మండలం సింగరాజుపాలెంలో శివాలయం వద్ద అన్న సంతర్పణ కార్యక్రమంలో భాగంగా వంటలు చేయడానికి వెళ్లారు. అక్కడ కార్యక్రమం ముగించుకొని ఆటోలో తిరిగి ఉంగుటూరు వస్తుండగా నీలాద్రిపురం రహదారి మలుపులో ఆటో అదుపుతప్పి పక్కన పంట చేలు వద్ద బోల్తా పడింది. ఆటోలో ఉన్న మహిళలు కోరాడ దుర్గ, సిరాపు అచ్యుతాంబ, పతివాడ ఛాయాదేవి, సాగు సంతోష్, ఇర్ల పాటి సుబ్బమ్మ, మరపట్ల వరలక్ష్మి, మరపట్ల సూర్యలక్ష్మి, బళ్ళమూడి పద్మ లు గాయపడ్డారు. వీరిని 108 అంబులెన్స్ వాహనంలో తాడేపల్లిగూడెం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. భగవంతుడు దయవలన స్వల్ప గాయాలతో తో బయటపడ్డామని గాయపడిన మహిళలు తెలిపారు. అర్ధరాత్రి కావడంతో మలుపు కనిపించక ఆటో అదుపుతప్పి బోల్తా పడిందని ఆటో డ్రైవర్ చించినాని వెంకటేష్ తెలిపారు. ప్రమాదంలో ఆటో దెబ్బతింది.