విశాలాంధ్ర- ఏలూరు: స్థానిక శాంతినగర్ శ్రీచైతన్య పాఠశాలలో ఈ నెల స్మార్ట్ లివింగ్ ప్రోగ్రాం లో భాగంగా పర్యావరణం-పరిరక్షణ లక్ష్యంగా ప్రారంభించిన ఃహరిత భారత్ః పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బి.శివకుమారి తెలిపారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏలూరు సోషల్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ డి. హనుమంతుడు మాట్లాడుతూ మొక్కలు నాటడం,వాటిని సంరక్షించడం, అడవుల పెంపకం , భావితరాలకు ఆరోగ్యకరమైన ప్రకృతిని ప్రసాదించడం తదితర అంశాలను ప్రతీ పౌరుని, ప్రాథమిక బాధ్యతగా అభివర్ణించారు. అనంతరం విద్యార్థినీ విద్యార్థులు, అధ్యాపక సిబ్బందిచే మొక్కలు నాటే ఆవశ్యకతను తెలిపే విధంగా, సామాజిక స్పృహను పెంపొందించే ప్రత్యేక ప్రతిజ్ఞను చేయించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శివకుమారి మాట్లాడుతూ సుందర్ లాల్ బహుగుణ వంటి గొప్ప పర్యావరణ పరిరక్షకుల బాటలో పయనించాలన్నారు. ప్రతి విద్యార్థి కనీసం ఒక మొక్క చొప్పున నాటి వారి సామాజిక బాధ్యతను నిర్వర్తించాలన్నారు. తల్లిదండ్రులను ఇతర కుటుంబ సభ్యులను ఈ కార్యక్రమంలో భాగస్తులను చేసే విధంగా విద్యార్థులకు తెలియజేసేలా నిర్వహించే అనేక కార్యక్రమాలలో ఇదొక ఇదో ప్రత్యేక కార్యక్రమం అన్నారు.అనంతరం వివిధ అంశాలలో నిర్వహించిన పోటీలలో గెలుపొందిన విజేతలకు ఏలూరు జిల్లా వన విభాగం తరఫున మొక్కలను బహూకరించారు.సభలో ఏలూరు, పాలకొల్లు శ్రీచైతన్య విద్యాసంస్థల రీజనల్ ఇంచార్జ్ సుంకర పార్థసారథి ,జోనల్ ఎకడమిక్ కోఆర్డినేటర్ సిహెచ్ ఉదయ్ భాస్కర్,జోనల్ ఎకడమిక్ డీన్ జాల సంజీవ్ కుమార్, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.