విశాలాంధ్ర -దెందులూరు: ఏలూరు జిల్లాలోని దెందులూరు మండలం వేగవరం హేలాపురి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, అరసవల్లి అరవింద్ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 22,23 తేదీలలో ఉదయం గం.10 గంటల నుండి సాయంత్రం గం.5 గంటల వరకు హేలాపురి కళాశాల ఆవరణలో నందు జాబ్ మేళా నిర్వహించబడుతుందని అరసవల్లి అరవింద్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ , హేలాపురి కళాశాల వైస్ ప్రెసిడెంట్ అరసవల్లి అరవింద్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్ మేళాకు ఇంటర్వ్యూలు నిర్వహించుటకు విప్రో , హెచ్ డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్, కాప్స్ స్టోన్ ఫెసిలిటీస్ మేనేజ్మెంట్ లిమిటెడ్, ఆదాన్ సొల్యూషన్ , ఫ్లోటెక్, కేఏవై ఫైనాన్షియల్ సొల్యూషన్స్, టీం గోల్, సెక్యూర్ స్మార్ట్ సొల్యూషన్స్ , ఏ ఎం ఎస్ వై ఎస్ , టెక్ మహీంద్రా, టాలెంట్ ప్రో ఫౌండేషన్, టెలి పెర్ఫార్మెన్స్ , ఐఎన్ఎన్ఓవి యువర్ పీపుల్ పార్ట్నర్ , ముత్తూట్ ఫైనాన్స్ , హెచ్ జి ఎస్ హిందూజా గ్లోబల్ సొల్యూషన్స్ , క్రాప్ వన్ , కళ్యాణి మోటార్స్ , ఐడిఎఫ్ సి ఫస్ట్ బ్యాంక్ , అపోలో ఫార్మసీ, జీజే సొల్యూషన్స్ , ఫోర్ట్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ , జెన్పాక్ట్ , హెచ్ ఆర్ హెచ్ నెక్స్ట్ , టీం లిస్ ఈడి టెక్ వంటి 60 కి పైగా మల్టీ నేషనల్ దిగ్గజ కంపెనీల ప్రతినిధులు హాజరుకానున్నారని తెలిపారు. ఈ మేళాలో 3వేలకు పైగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నట్లు తెలిపారు. ఏలూరు పరిసర ప్రాంత యువకులకు కల్పిస్తున్న ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఇతర వివరముల కొరకు హేలాపురి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, అరసవల్లి అరవింద్ చారిటబుల్ ట్రస్ట్ వారి నెంబర్ 91 99899 14587 , 91 94592 56666.. WWW.arasavilli.org వెబ్సైట్ నందు సంప్రదించాలని తెలియజేశారు.