సింధుతో కలిసి ఐస్క్రీం తిన్న మోదీ
స్టార్ షట్లర్ పీవీ సింధుతో కలిసి ప్రధాని మోదీ ఐస్క్రీమ్ తిన్నారు.జావెలిన్ త్రోలో స్వర్ణం సాధించిన నీరజ్ చోప్రాకు ఆయన చుర్మా రుచి చూపించారు. టోక్యో గేమ్స్ వెళ్లే ముందు అథ్లెట్లతో ముచ్చటించిన సమయంలో..వారి వ్యక్తిగత ఇష్టాఇష్టాల గురించి అప్పుడు ప్రస్తావించారు. సింధూకు ఐస్క్రీం ఇష్టమని, నీరజ్కు చుర్మ ఇష్టమని తెలుసుకున్నారు. పతకంతో తిరిగి వచ్చాక ఐస్క్రీమ్ తిందామని సింధుతో మోదీ చెప్పారు. దాని ప్రకారమే ఇవాళ మోదీ తన మాట నిలబెట్టుకున్నారు. టోక్యో ఒలింపిక్స్లో భారత్కు పతకాలు తెచ్చిపెట్టిన అథ్లెట్లతో పాటు క్రీడలకు వెళ్లిన బృందంతో ఇవాళ ప్రధాని మోదీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తన నివాసంలో అథ్లెట్లకు ప్రధాని అల్పాహార విందు ఇచ్చారు.ఒక్కో అథ్లెట్ వద్దకు వెళ్లి ఆత్మీయంగా మాట్లాడారు. వారు సాధించిన విజయాలను ప్రశంసించారు. టోక్యో బ్యాడ్మింటన్లో సింధు బ్రాంజ్ మెడల్ గెలిచిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్కు సింధూ రియో పతకాన్ని కూడా తీసుకువచ్చింది. రెండు మెడల్స్ మెడలో వేసుకుని ప్రధాని మోదీతో సింధు ఫోటో దిగింది.