: ప్రధాని మోదీ
ఆధ్యాత్మిక పర్యాటకాన్ని పటిష్టపరచవలసిన అవసరం ఉందని, దీనివల్ల యువతకు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు.అంతేగాక యువతకు మన దేశ గత సంస్కృతి గురించి తెలుస్తుందన్నారు. గుజరాత్లోని సోమ్నాథ్లో వివిధ ప్రాజెక్టులకు శుక్రవారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఆయన శంకుస్థాపనలు చేశారు. సోమ్నాథ్ ప్రొమెనేడ్, సోమ్నాథ్ ఎగ్జిబిషన్ సెంటర్, పార్వతీ దేవి దేవాలయం, పాత (జునా) సోమ్నాథ్ దేవాలయ ప్రాంగణ పునర్నిర్మాణం ప్రాజెక్టులకు మోదీ శుక్రవారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,సోమనాథ్ దేవాలయం నవ భారతానికి చిహ్నమని, గడచిన వందల సంవత్సరాల్లో ఈ దేవాలయాన్ని, విగ్రహాలను ధ్వంసం చేశారన్నారు. దీనిని పతనం చేయడానికి ప్రయత్నం జరిగిన ప్రతిసారీ ఇది తిరిగి లేచి నిలబడిరదన్నారు. మనం గతం నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉన్నదని పేర్కొన్నారు.