కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు తీర్పు
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : కోర్టు ధిక్కరణ కేసులో ఏపీఐఐసీ ఎండీ ప్రవీణ్ కుమార్కు హైకోర్టు జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడిరచింది.
గతంలో విశాఖపట్నం కలెక్టర్గా పని చేస్తున్న సమయంలో ప్రవీణ్కుమార్ కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారని కోర్టు ధిక్కరణ కేసు నమోదయింది. భీమునిపట్నం మండలంలోని కాపులుప్పాడ గ్రామ పరిధిలో 7 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ నిలిపివేసి, నిషేధిత భూముల జాబితాలో చేర్చారని అభియోగాలున్నాయి.
ఆ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని 2017లో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది, హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలయింది. దీనిపై బుధవారం ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టగా, ఉద్దేశపూర్వకంగానే కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారని పిటీషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. రెండుపక్షాల వాదనలు విన్న అనంతరం ప్రవీణ్కుమార్కు రెండు వారాల జైలు శిక్ష, రూ.25 వేల జరిమానా విధిస్తూ, తీర్పు అమలును మాత్రం నాలుగు వారాలకు వాయిదా వేస్తూ కొంత ఉపశమనం కలిగించింది.