Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

కడప నుంచి వైఎస్‌ షర్మిల

. 114 అసెంబ్లీ…ఐదు లోక్‌సభ స్థానాలు
. వైఎస్‌ ఆశయసాధనకు కృషి బ రాహుల్‌ ప్రధాని కావాలన్నదే ఆశయం
. వివేకా కేసులో హంతకుడికి టికెట్‌ దారుణం
. ఇడుపులపాయలో అభ్యర్థుల జాబితా ప్రకటించిన షర్మిల

విశాలాంధ్ర – వేంపల్లె : ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి 114 అసెంబ్లీ, ఐదు లోక్‌సభ అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల మంగళవారం విడుదల చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం వర్గం ఆదేశాల మేరకు ఇడుపులపాయలోని వైఎస్‌ ఘాట్‌ వద్ద ఆమె జాబితా ప్రకటించారు. అనం తరం షర్మిల మాట్లాడుతూ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఆశయ సాధనకు కృషి చేస్తానని పునరుద్ఘాటిం చారు. 2019 ఎన్నికల్లో తనను కడప లోక్‌సభ అభ్యర్థిగా పోటీచేయాలని చిన్నాన్న వివేకానందరెడ్డి పదేపదే కోరారని, కానీ అప్పట్లో తాను పెద్దగా ఆలోచించలేదన్నారు. ఆయన ఆకాంక్ష మేరకే తాను ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానన్నారు. వివేకానందరెడ్డి హత్య కేసులో హంతకుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాశ్‌రెడ్డికి వైసీపీ కడప లోక్‌సభ అభ్యర్థిగా టికెట్‌ కేటాయించడం దారుణమన్నారు. రాహుల్‌ను ప్రధాని చేయాలని తన తండ్రి పరితపించేవారన్నారు. ఆయన ఆశయం నెరవేర్చే అవకాశం ఇప్పుడు తనకు లభించిందన్నారు. తండ్రి ఆశయం కోసం తాను కాంగ్రెస్‌ పార్టీలో చేరానని, ఇప్పుడు లోక్‌సభ అభ్యర్థిగా తనను అధిష్ఠానం పోటీ చేయాలని కోరినందున బరిలో నిలుస్తున్నానన్నారు. ప్రస్తుతం ఐదుగురు లోక్‌సభ, 114 అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించామని చెప్పారు. మిగిలిన స్థానాలకు అభ్యర్థులను త్వరలో ప్రకటిస్తామని ఆమె వెల్లడిర చారు. కాంగ్రెస్‌ కార్యకర్తలంతా సైనికుల్లా పనిచేస్తే తప్పక విజయం సాధిస్తానన్నారు. కడప లోక్‌సభ స్థానం నుంచి షర్మిల పోటీ చేయను న్నారు. కాకినాడ లోక్‌సభ స్థానానికి పల్లంరాజు, బాపట్లకు జేడీ శీలం, రాజమహేంద్రవరానికి గిడుగు రుద్రరాజు, కర్నూలుకు రామ్‌ పుల్లయ్య యాదవ్‌ పేర్లను ఖరారు చేశారు. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద రాజశేఖర్‌రెడ్డికి షర్మిల ఘన నివాళులు అర్పించారు. నివాళులర్పించిన వారిలో తల్లి విజయమ్మ, రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజు, పల్లంరాజు, జేడీ శీలం, తులసిరెడ్డి ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img