సీపీఐ జాతీయ కార్యదర్శి అజీజ్ పాషా
విజయవాడలో భారీ రోడ్షో
ప్రజల మనిషి కోటేశ్వరరావును గెలిపించాలని పిలుపు
విశాలాంధ్ర – విజయవాడ : కేంద్రంలో పదేళ్లుగా అధికారంలో ఉండి అభివృద్ధి గురించి చెప్పటానికి ఏమి లేక మతాల మధ్య చిచ్చుపెడుతున్న ప్రధాని మోదీకి ప్రజలు బుద్ధి చెప్పాలని సీపీఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎంపీ అజీజ్ పాషా అన్నారు. ఇండియా కూటమి బలపర్చిన విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సీపీఐ అభ్యర్థి జి.కోటేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ శుక్రవారం విజయవాడ వన్టౌన్ ప్రాంతంలో నిర్వహించిన భారీ రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అజీజ్ పాషా మాట్లాడుతూ… ఇప్పటివరకు జరిగిన రెండు విడతల ఎన్నికల్లో పోలింగ్ సరళి ఎన్డీఏకి అనుకూలంగా లేదని ఇంటెలిజెన్స్ రిపోర్టులు రావడంతో మోదీ హిందూ, ముస్లింల మధ్య చిచ్చుపెట్టి రాజకీయలబ్ధికి కుట్ర చేస్తున్నారని విమర్శించారు. మత విద్వేషాలు రెచ్చగొడుతున్న మోదీపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవటం లేదన్నారు. ఎన్నికల కమిషన్ను గుప్పెట్లో పెట్టుకోవటమే దీనికి కారణం అన్నారు. సుప్రీం కోర్టు అయినా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రపంచంలో 3వ ఆర్థిక శక్తిగా భారత్ ఎదుగుతున్నట్లు గొప్పలు చెబుతున్నారని… వాస్తంగా దేశ ఆర్థిక పరిస్థితి దివాలా తీసేలా ఉందన్నారు. 2014లో వ్యవసాయ రంగంలో ఎగుమతులు 10.10 శాతం ఉంటే ఇప్పుడు 2.2 శాతంగా ఉందన్నారు. జీడీపీలో అమెరికా, జర్మనీ, జపాన్, చైనా కంటే వెనుకబడి ఉన్నామన్నారు. మోదీ ప్రభుత్వం మీడియాను చెప్పుచేతల్లో పెట్టుకుని తాను ఏదో సాధించినట్లు దేశంలో ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జీ20 సదస్సు మన కంటే ముందు ఇండోనేసియాలో జరిగిందని, వారు రూ.130 కోట్లు ఖర్చు చేశారని, జపాన్ రూ.510కోట్లు,