విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుపై అనర్హత వేటు పడిరది. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషెన్ రాజు సోమవారం ఉత్తర్వులు జారీజేశారు. ఎన్నికలకు ముందు ఇందుకూరి టీడీపీలో చేరారు. విశాఖలో వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స రaాన్సీని, శృంగవరపుకోట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కడుబండి శ్రీనివాసరావును ఓడిరచేందుకు ఆయన ప్రయత్నించినట్లు పార్టీ శ్రేణులు గుర్తించారు. ఆయనపై అంతకుముందే పార్టీ ఫిరాయింపుల చట్టం కింద అనర్హత వేటు వేయాలని చైర్మన్కు వైసీపీ ఎమ్మెల్సీలు ఫిర్యాదు చేశారు. దీనిపై అనేక సార్లు విచారణకు రావాలని రఘురాజుకు చైర్మన్ ఆదేశాలు జారీ జేసినప్పటికీ ఆయన డుమ్మా కొట్టారు. తుదకు మే 31న విచారణకు రావాలని చైర్మన్ నోటీసులు పంపినప్పటికీ, దానికి రఘురాజు హాజరు కాకుండా అనారోగ్య కారణాలను చూపి విశాఖలో ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం ఇచ్చారు. దీంతో రఘురాజుపై అనర్హత వేటు పడిరది.