విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: ఆంధ్రప్రదేశ్లో మూడు జిల్లాల కలెక్టర్లు, ఐదు జిల్లాల ఎస్పీలను నియమించారు. ఎన్నికల ప్రక్రియలో నిర్లక్ష్యంతోపాటు అధికార వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలపై కొందరు ఎస్పీలు, కలెక్టర్లపై ఇటీవల అందిన ఫిర్యాదులపై ఈసీ బదిలీ వేటు వేసిన విషయం విదితమే. వారి స్థానంలో అధికారులను నియ మిస్తూ ఎన్నికల సంఘం గురువారం ఉత్తర్వులు జారీజేసింది. నూతనంగా నియమితులైన అధికారులంతా వారంతా గురువారం రాత్రి ఎనిమిది గంటల్లోగా చార్జ్ తీసుకోవాలని ఆదేశిం చింది. కృష్ణాజిల్లా కలెక్టర్గా డీకే బాలాజీ, అనంతపురం కలెక్టర్గా వినోద్కుమార్, తిరుపతి కలెక్టర్గా ప్రవీణ్కుమార్, ప్రకాశం ఎస్పీగా సుమిత్ సునీల్, పల్నాడు ఎస్పీగా బిందు మాధవ్, చిత్తూరు ఎస్పీగా మణికంఠ చందోలు, అనంతపురం ఎస్పీగా అమిత్ బర్తర్, నెల్లూరు ఎస్పీగా అరిఫ్ హఫీజ్, గుంటూరు ఐజీగా సర్వశ్రేష్ట త్రిపాఠి నియమితులయ్యారు.