Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

తప్పిన తుపాను గండం

అయినా తీరప్రాంతాల్లో ఆటుపోట్లు
ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగే అవకాశం
చేపల వేటకు వెళ్లొద్దు: వాతావరణ శాఖ

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ఏపీకి తుపాను ముప్పు తప్పింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం 24 గంటల్లో తుపానుగా మారవచ్చని, దానికి ‘రేమాల్‌’గా నామకరణం చేసినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడిరచారు. అది ఈశాన్య దిశగా కదిలి బంగ్లాదేశ్‌ వద్ద 27వ తేదీ అర్ధరాత్రి దాటాక తీరం దాటే అవకాశమున్నట్లు అంచనా వేశారు. దీనివల్ల ఒడిశా, బంగాల్‌, బంగ్లాదేశ్‌పై తుపాను ప్రభావం ఉంటుందని తెలిపారు. మధ్య బంగాళాఖాతంలో సముద్రం ఆటుపోట్లకు గురయ్యే అవకాశం ఉన్నందున వేటకు వెళ్లొద్దని మత్సకారులకు సూచించారు. రాష్ట్రంలోని అన్ని పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేసినట్లు విశాఖ వాతావరణశాఖ అధికారి డాక్టర్‌ సునంద తెలిపారు.
తుపాను ప్రభావం రాష్ట్రంపై ఏమాత్రం ఉండదని, రాబోయే రెండు, మూడు రోజులు ఉష్ణోగ్రతలు అత్యధికంగా ఉంటాయన్నారు. తుపాను ప్రభావంతో రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయని వాతావరణశాఖ పేర్కొంది. నైరుతి రుతుపవనాలు శ్రీలంక వరకు విస్తరించాయని వెల్లడిరచింది. సముద్ర తీరానికి దూరంగా తుపాను పయనించనున్నందున ఆ దిశగా భూ ఉపరితలం మీద నుంచి వేడి గాలులు వీయనున్నాయి. ఇప్పటికే వాయువ్య భారతం నుంచి తీవ్ర వడగాల్పుల మధ్య ఒడిశా`ఆంధ్రప్రదేశ్‌ మీదుగా అల్పపీడనం దిశగా వీస్తున్నాయి. అందువల్ల 27వ తేదీ వరకు వడగాల్పుల తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img