ఇజ్రాయిల్కు ఐరాస`ఐసీజే ఆదేశం
జెనీవా: గాజాలోని రఫా నగరంలో సైనిక చర్యలను తక్షణమే ఆపమని ఇజ్రాయిల్కు ఐరాస అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. గాజాలో హమాస్ అంతమే లక్ష్యమంటూ ఇజ్రాయిల్ దాడులు కొనసాగిస్తుండటాన్ని ఆక్షేపించింది. 15 మందితో కూడిన జడ్జిల ప్యానల్ ఈ ఏడాది మూడు సార్లు ఉత్తర్వులు జారీచేసింది. ప్రాణ నష్టాన్ని, మానవతా సంక్షోభాన్ని నిరోధించేందుకు ప్రయత్నించింది. చట్టబద్ధంగా ఆదేశాలు జారీ చేసినప్పటికీ వాటిని అమలు చేయించడంలో కోర్టు విఫలమైంది. తాజాగా అంతర్జాతీయ న్యాయస్థానం వెలువరించిన ఉత్తర్వులపై న్యాయాధికారి నవాఫ్ సలామ్ ఒక ప్రకటన చేశారు. మార్చిలో ఇచ్చిన ఉత్తర్వులను బేఖాతరు చేయడంతో ఇప్పుడు ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు నెలకొన్నాయని కోర్టు పేర్కొన్నదన్నారు. రఫాలో సైనిక దురాక్రమణ, దాడులను తక్షణమే ఆపేయాలని ఇజ్రాయిల్కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడిరచారు. కాగా, ఇజ్రాయిల్ ఏకపక్ష ధోరణి ఆ దేశాన్ని అంతర్జాతీయంగా ఏకాకిని చేస్తోంది. పలస్తీనాపై దాడులు ఆపాలని ప్రపంచ దేశాల నుంచి పెరుగుతున్న ఒత్తిడిని ప్రతిబింబిస్తూ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ (ఐసీజే) ఆదేశాలిచ్చింది.