విశాలాంధ్ర – విజయవాడ : ఇండియా కూటమిలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్, సీపీఐ మధ్య సీట్ల ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం రాష్ట్రంలో సీపీఐ ఒక లోక్సభ, 8 అసెంబ్లీ సీట్లలో పోటీ చేస్తుంది. ఈ విషయాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ గురువారం రాత్రి వెల్లడిర చారు. కాంగ్రెస్తో తమకు సీట్ల ఒప్పం దం కుదిరిందని ఆయన తెలిపారు. ఒక లోక్సభ, ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో సీపీఐని బలపర్చటానికి కాంగ్రెస్ అంగీ కారం తెలిపిందన్నారు. ఇటీవల హైదరాబాద్లో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నివాసంలో రెండు పార్టీల మధ్య తొలివిడత చర్చలు జరిగాయ న్నారు. కాంగ్రెస్ నుంచి షర్మిల, సీడబ్ల్యూసీ సభ్యులు రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజు, పార్టీ కేంద్ర ప్రతినిధి కె.రాజు పాల్గొనగా సీపీఐ నుంచి కె.రామకృష్ణ సహా రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరావు, కార్యదర్శివర్గ సభ్యుడు జి.ఓబులేసు పాల్గొన్నారు. గుంటూరు పార్లమెంటు నియోజకవర్గంతో పాటు విశాఖపట్నం పశ్చిమ, ఏలూరు, విజయవాడ పశ్చిమ, అనంతపురం, పత్తికొండ, తిరుపతి, రాజంపేట, కమలాపురం అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయని రామకృష్ణ వివరించారు.