దేశంలో సెకండ్ వేవ్ అనంతరం కేసుల సంఖ్య భారీగా తగ్గాయి. 147 రోజుల అనంతరం భారీగా కేసుల సంఖ్య తగ్గినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడిరచింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 28,204 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 31998158 కి చేరాయి. గడిచిన 24 గంటల్లో 373 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 428682 కి పెరిగింది. నిన్న కరోనా నుంచి 41,511 మంది కోలుకున్నారు. వీటితో కలిపి మొత్తం రికవరీల సంఖ్య 3.11 కోట్లకు చేరింది.ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 3,88,508 ఉన్నాయి. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. నిన్న దేశవ్యాప్తంగా 54,91,647 మందికి వ్యాక్సిన్ అందించారు. వీటితో కలిపి ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 51,45,00,268కి చేరింది.