. ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాలను ధృవీకరించిన ట్రిబ్యునల్
. కేంద్ర మంత్రిత్వశాఖ, కలెక్టర్ల నివేదికలు భిన్నంగా ఉన్నట్లు వెల్లడి
. సర్వోన్నత న్యాయస్థానమే తేలుస్తుందని స్పష్టీకరణ
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్జీటీలో ఎదురుదెబ్బ తగిలింది. ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలను ధృవీకరించింది. దీనిపై సుప్రీంకోర్టుకు నివేదిక అందజేస్తామని, సర్వోన్నత న్యాయస్థానమే దీనిపై ఏమి చేయాలనేది తేలుస్తుందని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలపై సామాజిక కార్యకర్త దండా నాగేంద్ర పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆయన పిటిషన్పై విచారించి ఇసుక అక్రమ తవ్వకాలు నిలిపివేయాలని, కేంద్ర అటవీశాఖ నివేదిక సమర్పించాలని గతంలో ఎన్జీటీ ఆదేశించింది. దీనిపై బుధవారం ఎన్జీటీకి కేంద్ర పర్యావరణ అటవీశాఖ కమిటీ నివేదిక అందజేసింది. పర్యావరణ అనుమతులు లేకుండా ఏపీలో ఇంకా భారీగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నట్లు నివేదికలో కేంద్ర కమిటీ నిర్ధారించింది. ఫొటోలతో పాటు ఇతర సాక్ష్యాధారాలతో నివేదికను ఎన్జీటీకి అందజేసింది. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో యంత్రాలతో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని పేర్కొంది. ఎలాంటి అనుమతులు లేకుండా 24 గంటలూ తవ్వకాలు చేపడుతున్నారని, ఒక్కో రీచ్లో రోజుకు 2 వేల టన్నుల మేర తవ్వకాలు కొనసాగుతున్నాయని వెల్లడిరచింది. శాటిలైట్ చిత్రాల ద్వారా తవ్వకాల ఆధారాలు సేకరించామని వివరించింది. ఎలాంటి ఈసీలు లేకుండా తవ్వకాలు చేస్తున్నారని తెలిపింది. గతంలో ఎన్జీటీ ఇచ్చిన ఆదేశాలు అమలు కావట్లేదని పేర్కొంది.
గతంలో ఇసుక అక్రమాలపై జేపీ పవర్ వెంచర్స్కి 18 కోట్లు తాత్కాలికంగా ఎన్జీటీ జరిమానా విధించింది. మొత్తం ఎన్ని రీచ్లలో అక్రమ మైనింగ్ జరుగుతుందో తేల్చాలని కమిటీని నియమించింది. అక్రమాలు జరిగినట్లు నివేదికలో వెల్లడైతే ప్రతి రీచ్కి కోటి రూపాయల చొప్పున జరిమానా చెల్లించాలని ఎన్జీటీ ఆదేశించింది. ఏపీలో సుమారు 40 రీచ్లలో మాన్యువల్ మైనింగ్కి ఈసీ అనుమతులుంటే 500లకు పైగా రీచ్లలో ఈసీ అనుమతులు లేకుండా యంత్రాలతో ఇసుక మైనింగ్ చేస్తున్నట్లు కేంద్ర కమిటీ నివేదిక బట్టబయలు చేసింది. ఈ నివేదిక ప్రకారం జేపీ పవర్ వెంచర్ కంపెనీ రూ.500 కోట్లకు పైగా జరిమానా చెల్లించాల్సి ఉంటుందని ఎన్జీటీ అభిప్రాయపడిరది. గతంలో ఎన్జీటీ ఆదేశాలను జేపీ పవర్ వెంచర్స్ సుప్రీంలో సవాలు చేసింది. ఎన్జీటీ విధించిన జరిమానా నిలిపివేసేందుకు సుప్రీంకోర్టు