కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన దిల్లీలో మంగళవారం రోజు జీఎస్టీ కౌన్సిల్ 50వ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో పలు వస్తువులు, సేవలపై జీఎస్టీ రేట్లలో కేంద్రం మార్పులు ప్రకటించింది. వాటిని ఓసారి పరిశీలిద్దాం. జీఎస్టీ 50వ సమావేశంలో మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. క్యాన్సర్తో పోరాడే మెడిసిన్స్ సహా ఇతర అరుదైన వ్యాధులకు సంబంధించిన మందులను జీఎస్టీ పన్ను నుంచి మినహాయించింది. ఇంకా ప్రైవేట్ కంపెనీల ఉపగ్రహ ప్రయోగ సౌకర్యాన్ని కూడా పన్ను మినహాయింపు కిందకు తీసుకొచ్చింది. ఫిష్ సోలుబ్లే పేస్ట్, ూణ స్లాగ్పై జీఎస్టీ రేటు ప్రస్తుతం ఉన్న 18 శాతం నుంచి 5 శాతానికి దిగొచ్చింది. సినిమా హాళ్లలో తినుబండారాలపైనా జీఎస్టీని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించింది. నూలుపై కూడా Gూు ని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అన్కుక్డ్, అన్ఫ్రైడ్ స్నాక్ పెల్లెట్స్పైనా జీఎస్టీని 12 నుంచి 5 శాతానికి తగ్గించింది. ఇమిటేషన్ జరీ థ్రెడ్పైనా ఇదే అమలు చేసింది. మరోవైపు మల్టీ అటిలిటీ వెహికిల్స్పై 22 శాతం సెస్ విధించేందుకు Gూు మండలి ఆమోదం తెలిపింది. ఇక ఎప్పటినుంచో అనుకుంటున్న ఆన్లైన్ గేమింగ్, హార్స్ రేసింగ్, క్యాసినోలపై పెట్టుబడి పెట్టిన మొత్తం నగదుపై 28 శాతం పన్ను విధించనున్నట్లు స్పష్టం చేసింది. ఇక 28 శాతం జీఎస్టీలో ఎన్నో వస్తువులు ఉన్నాయి. పాన్ మసాలా, కార్బొనైటెడ్ డ్రింక్స్, కెఫైన్ డ్రింక్స్, పొగాకు, సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులు, ఏసీలు, టైర్లు, డిష్ వాషింగ్ మెషీన్స్, స్మోకింగ్ పైప్స్ వంటివి 28 శాతం జీఎస్టీ శ్లాబులో ఉన్నాయి. ఆన్లైన్ గేమింగ్ బిజినెస్పై జీఎస్టీ భారీగా పెంచిన నేపథ్యంలో.. ఆ రంగంలోని నజారా టెక్నాలజీస్, డెల్టా కార్ప్, జన్సర్ టెక్నాలజీస్ వంటి కంపెనీల షేర్లు భారీగా పతనమయ్యాయి.