బ్యాంక్ అకౌంట్ తెరిచేందుకు, మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు, జీవిత బీమా పాలసీ కొనుగోలు చేసేందుకు తప్పనిసరిగా నో యువర్ కస్టమర్ (కేవైసీ) వివరాలు ఇవ్వాల్సిందే. కేవలం ఒకసారి వివరాలు సబ్మిటే చేస్తే సరిపోదు.. పలు మార్పు కేవైసీ అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఇలా కేవైసీ ప్రాసెస్ ని పలు మార్లు అప్డేట్ చేయడం అనేది ఇబ్బందికరంగా మారుతుందని చెప్పవచ్చు. ఈ క్రమంలో పేపర్వర్క్, సమయం, ప్రాసెస్ ఖర్చును తగ్గించేందుకు ఫైనాన్స్ స్టెబిలిటీ, డెవలప్మెంట్ కౌన్సిల్ (ఖీూణజ) కీలక ప్రతిపాదనలు చేసింది. ఫైనాన్స్ సెక్టార్లోని అన్నింట్లో యూనిఫామ్ కేవైసీ అమలు చేయాలని కేంద్రానికి ప్రతిపాదించింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఫైనాన్స్ సెక్రెటరీ టీవి సోమనాథన్ నేతృత్వంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. యూనిఫామ్ కేవైసీ నిబంధనలపై సూచనలు చేయాలని కోరినట్లు తెలుస్తోంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఇటీవల జరిగిన సమావేశంలో ఎఫ్ఎస్డీసీ కీలక ప్రతిపాదనలు చేసింది. వినియోగదారులను ధ్రువీకరించేందుకు ఆర్థిక రంగం అంతటా కేవైసీ రికార్డుల అంతర్ వినియోగాన్ని సులభతరం చేసేందుకు, కేవైసీ ప్రక్రియను డిజిటలైజేషన్ సులభతరం చేయడానికి యూనిఫామ్ కేవైసీని తీసుకురావాలని ఎఫ్ఎస్డీసీ ప్రతిపాదించింది. యూనిఫామ్ కేవైసీ అనేది కేవైసీ ప్రాసెస్ లో ఏకరూపతను తీసుకొస్తుందని ఎఫ్ఎస్డీసీ పేర్కొంది. అలాగే ఒకే విధమైన కేవైసీని పలుమార్లు చేయాల్సిన అవసరాన్ని తొలగిస్తుంది.
సెంట్రల్ కేవైసీ రికార్డ్స్ రిజిస్ట్రీ 2016లో ఏర్పాటు చేశారు. దీని ముఖ్య ఉద్దేశం వివిధ రకాల ఫైనాన్షియల్ అసెట్స్లో పెట్టుబడులు పెడుతున్నప్పుడు తరుచుగా కేవైసీ ప్రాసెస్ చేయాల్సిన అవసరాన్ని తగ్గించడం. అయితే, ఇది కేవలం క్యాపిటలం మార్కెట్కే పరిమితమైంది. స్టాక్ బ్రోకర్, డిపాసిటరీ పార్టిసిపెంట్స్, మ్యూచువల్ ఫండ్ వంటి రిజిస్టర్డ్ ఇంటర్మీడియరీ ద్వారా సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాలో కేవైసీ పూర్తి చేసినట్లయితే మీరు కొత్త పెట్టుబడులకు ఎలాంటి కేవైసీ పూర్తి చేయాల్సిన అవసరం లేదు. అయితే, బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్, ఇన్సూరెన్స్ పాలసీల కొనుగోలుకు కేవైసీ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఈ ఇబ్బందులను తగ్గించేందుకే కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.