రాజ్యసభ ఎన్నికల్లో బిజెపికి క్రాస్ ఓటింగ్ వేసిన హిమాచల్ ప్రదేశ్కు చెందిన ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసింది. ఆరుగురు రెబల్ ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు అసెంబ్లీ స్పీకర్ గురువారం ప్రకటించారు. అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలు రాజిందర్ రాణా, సుధీర్ శర్మ, ఇందర్ దత్ లఖన్పాల్, దేవీందర్ కుమార్ భూటూ, రవి ఠాకూర్, చైతన్యశర్మలు. బుధవారం అసెంబ్లీలో ఆర్థిక బిల్లుపై ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయాలన్న పార్టీ విప్ను ఉల్లంఘించినందుకు వారిని అనర్హులుగా ప్రకటించినట్లు అసెంబ్లీ స్పీకర్ కుల్దీప్ సింగ్ పేర్కొన్నారు. ఆరుగురు ఎమ్మెల్యే చర్యలు ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఉల్లంఘించాయని అన్నారు. 15 మంది బిజెపి ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేసిన అనంతరం అసెంబ్లీ రాష్ట్ర బడ్జెట్ను ఆమోదించిన సంగతి తెలిసిందే.