Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. గిర్డర్‌ యంత్రం పడి 15మంది మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. గిర్డర్‌ యంత్రం కుప్పకూలిన ఘటనలో 15 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. థానే జిల్లాలోని షాపూర్‌లో మంగళవారం వేకువ జామున సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌ హైవే ఫేజ్-3 రోడ్డు పనుల్లో భాగంగా బ్రిడ్జి నిర్మిస్తున్నారు. ఇంతలో ఒక్కసారిగా గిర్డర్‌‌లు మోసే యంత్రం కార్మికులపై పడింది. ఘటనాస్థలంలోనే 15మంది కార్మికులు మృతి చెందారు.. పలువురికి గాయాలు అయ్యాయి. మృతులను, గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక, ఎన్డీఆర్ఎఫ్ టీమ్‌లు ఘటనాస్థలానికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. 100 అడుగుల ఎత్తు నుంచి ఈ గిర్డర్ పడినట్లు చెబుతున్నారు.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.. ప్రమాదానికి కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ సమృద్ధి మహామార్గ్‌ ను నాగ్‌పూర్‌-ముంబై మధ్య 701 కిలోమీటర్ల పొడవున నిర్మిస్తున్నారు. ఈ ఎక్స్‌ప్రెస్‌ హైవేలో రెండు దశలు పూర్తికాగా.. మూడో దశ పనులు జరుగుతున్నాయి. మే 26న రెండో దశలో భాగంగా నిర్మించిన నాసిక్‌లోని షిర్డీ-భర్వీర్‌ మధ్య నిర్మించిన మార్గాన్ని సీఎం షిండే ప్రారంభించారు. దీంతో సమృద్ధి మహామార్గ్‌లో 600 కిలోమీటర్లు అందుబాటులోకి వచ్చింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img