Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.. నాలుగు బోగీలు పూర్తిగా దగ్ధం

ప్రయాణికులు కిందకు దూకేయడంతో తప్పిన ప్రమాదం
మంటలను అదుపు చేస్తున్న ఫైర్ సిబ్బంది

యాదాద్రి జిల్లాలో ఫలక్‌నుమా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. ట్రైన్ హోరా నుంచి సికింద్రాబాద్ వస్తుండగా షార్ట్ సర్క్యూట్ కావడంతో బోగీలో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. ఈ మంటలు పక్కన ఉన్న బోగీలకు కూడా అంటుకుంటున్నాయి. ఈ ఘటనలో ూ3,ూ4,ూ5,ూ6 పూర్తిగా దగ్ధమైనట్లు తెలుస్తోంది. మిగతా బోగీలకు కూడా మంటలను వ్యాపిస్తున్నాయి. మంటలను గమనించిన ప్రయాణికులు వెంటనే అప్రమత్తమై ట్రైన్ నుంచి కిందకు దూకేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. పగిడిపల్లి-బొమ్మాయిపల్లి మధ్యన ఈ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంటలకు బోగీలు కాలిపోవడంతో దట్టమైన పొగలు చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించాయి. లోకో పైలట్ గమనించి ట్రైన్‌ను నిలిపివేశాడు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు, ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను ఆర్పివేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మంటలు వ్యాపిస్తుండటంతో ఆరో బోగీ వద్ద ఉన్న జాయింట్‌ను రైల్వే సిబ్బంది తొలగించారు. ఈ ప్రమాదంతో ట్రైన్‌ను ఘటనా స్థలంలోనే నిలిపివేయాల్సి వచ్చింది. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఉదయం 11 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కాలిపోయిన బోగీలలో ఎక్కువమంది శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ వాసులు ఉన్నారని, మంటలు రాగానే చైన్ లాగి ట్రైన్‌ను నిలిపివేసినట్లు తెలిపారు. ట్రైన్ లాగేయకుండా ఉంటే భారీ ప్రమాదం జరిదేని చెప్పారు. రిజర్వేషన్ లేకుండా కొంతమంది ట్రైన్‌లో ప్రయాణిస్తున్నారని, ఒక వ్యక్తి చార్జింగ్ పాయింట్ దగ్గర సిగరెట్ తాగడంతో మంటలు వచ్చినట్లు ప్రత్యక్ష సాక్షి ఒకరు వివరించారు. పట్ట పగలు కావడంతో మంటలను గమనించడంతో ప్రమాదం తప్పిందని ప్రయాణికులు చెబుతున్నారు. అగ్నిప్రమాదానికి కారణం అయిన బోగీలను డీలింక్ చేయడంలో ఆలస్యం జరిగింది. ఫలితంగా మరికొన్ని బోగీలకు మంటలు అంటుకున్నాయి. ఈ అగ్నిప్రమాదంతో ట్రైన్ ఘటనా స్థలంలోనే ఆగిపోవడంతో ట్రైన్ గమ్యస్థానానికి ఆలస్యంగా చేరుకోనుంది. కాలిన బోగీలను‌ డీలింక్ చేయడంతో మిగతా బోగీల్లోని ప్రయాణికులను సికింద్రాబాద్ తరలించేందుకు సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు. మరికాసేపట్లో ప్రమాదానికి గురైన ఫలక్‌నుమా రైలు సికింద్రాబాద్ బయలుదేరనుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img