. సార్వత్రిక ఎన్నికలపై ఈసీ కసరత్తు పూర్తి
. జాతీయ మీడియా కథనాలు
న్యూదిల్లీ: సార్వత్రిక ఎన్నికల తేదీలపై కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు పూర్తి చేసింది. లోక్సభ, కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కోసం ఈసీ కొన్ని రోజులుగా రాష్ట్రాల్లో వరుస పర్యటనలు చేసింది. రాజకీయ పార్టీలు, స్థానిక అధికారులతో సమావేశాలు నిర్వహించింది. అన్ని అంశాలు పరిశీలించిన తర్వాత ఎన్నికల షెడ్యూల్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మార్చి 9వ తేదీ తర్వాత ఎన్నికల తేదీలను ఈసీ ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియాలో కథనాలు వెలు వడ్డాయి. దేశవ్యాప్తంగా లోక్సభతోపాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణా చల్ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీలకు ఈ ఏడాది మేలోగా ఎన్నికలు జరగాల్సి ఉంది. వీటితో పాటు జమ్మూకశ్మీర్లోనూ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఈసీ భావిస్తోంది. ఇందుకోసం మార్చి 8-9 తేదీల్లో కేంద్ర ప్రభుత్వ అధికారులతో ఈ బృందం సమావేశం కానున్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. జమ్మూకశ్మీర్లో భద్రతా పరిస్థి తులు, బలగాలపై చర్చించనున్నారు. ఆ తర్వాత మార్చి 12-13 తేదీల్లో ఈసీ బృం దం జమ్మూకశ్మీర్లో పర్యటించి క్షేత్రస్థాయి పరిస్థితులు పరిశీలించనుంది. మార్చి రెండో వారంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. గత లోక్సభ ఎన్నికలకు 2019 మార్చి 10న షెడ్యూల్ ప్రకటిం చారు. ఏప్రిల్ 11 నుంచి మే 19వ తేదీ వరకు ఏడు దశల్లో పోలింగ్ జరిగింది. మే 23న ఓట్ల లెక్కంపు చేపట్టి ఫలితాలు ప్రకటించారు. ఈసారి కూడా ఏప్రిల్-మే నెలల్లోనే ఎన్నికలు నిర్వహించేలా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది.