ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు భారీ షాక్ తగిలింది. కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను రౌస్ అవెన్యూ కోర్టు తిరస్కరించింది. ఈ నాటి విచారణ సందర్భంగా కాసేపటి క్రితం ఆమె పిటిషన్ ను రిజర్వ్ లో ఉంచిన కోర్టు… కాసేపటి క్రితం తీర్పును వెలువరించింది. ఆమెకు 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఏప్రిల్ 9వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ తీర్పును వెలువరించింది. కవితను తీహార్ జైలుకు తరలించాలని కోర్టు ఆదేశించింది. కాసేపట్లో కవితను తీహార్ జైలుకు తరలించనున్నారు. అలాగే మధ్యంతర బెయిల్ పిటిషన్ పైన ఏప్రిల్ 1న విచారణ జరుగనుంది.