ఏడుగురుమృతి, 20మందికి గాయాలు
విశాలాంధ్ర – బ్యూరో నెల్లూరు : ఓ లారీ, ట్రావెల్స్ బస్సును ఢీకొట్టడంతో ఏడుగురు మృతి చెందారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. ఫిబ్రవరి 19వతేదీశనివారం2 గంటల సమయంలో( శుక్రవారం అర్ధరాత్రి తెల్లవారితే శనివారం అనగా) జిల్లాలోని ముసునూరు టోల్ ప్లాజా సమీపంలో వేగంగా దూసుకొచ్చిన ఓ లారీఇనుము లోడ్ తో ముందు వెళ్తున్న మరో లారీని ఢీకొట్టింది. దీంతో లారీ అదుపు తప్పి ఎదురుగా వస్తున్న ఓ ట్రావెల్స్ బస్సును ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో 7మంది సంఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోగామరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సుల్లో ఇరుక్కుపోయిన ప్రయాణికులను బయటకు తీసి క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ట్రావెల్స్ బస్సుచెన్నై నుంచి హైదరాబాద్ కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తామని పోలీసులు తెలిపారు.ఈ ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.