కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ పై సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ పెదవి విరిచారు. ఇది నిరుపయోగ బడ్జెట్ అని, ప్రజల కోసం కాదని విమర్శించారు. ఏ బడ్జెట్ అయినా అభివృద్ధి కోసం కాకపోతే, ఏ అభివృద్ధి అయినా ప్రజల కోసం కాకపోతే, అది పనికిరానిది. బీజేపీ ప్రభుత్వం దశాబ్దం పాటు ప్రజావ్యతిరేక బడ్జెట్లను పూర్తి చేసి సిగ్గుమాలిన రికార్డ్ సృష్టించింది. ఈ రికార్డ్ ఎప్పటికీ బ్రేక్ కాదు. ఎందుకంటే సానుకూల ప్రభుత్వం రావడానికి ఇప్పుడు సమయం ఆసన్నమైంది్ణ అని అన్నారు. ఈ మేరకు ఎక్స్లో హిందీలో పోస్ట్ చేశారు.కాగా, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా కూడా కేంద్ర బడ్జెట్పై స్పందించారు. అసలు బడ్జెట్ జూలైలో వస్తుందని తెలిపారు. అప్పుడు ప్రజలు ప్రయోజనం పొందుతారని, పర్యాటకం పెరుగుతుందని, పరిశ్రమలు కూడా పెరుగుతాయని, దేశం పురోగమిస్తుందని అన్నారు.