విశాలాంధ్ర – మదనపల్లె: ఆంధ్రప్రదేశ్, అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె మార్కెట్లో టమాటా ధరలలో రికార్డు నమోదు అయింది. బుధవారం రూ.168 పలికిన ధర శనివారం రూ.196కి పెరిగింది. రైతులు కేవలం 255 టన్నులను మార్కెట్కు తీసుకొచ్చినట్లు మార్కెట్ యార్డు కార్యదర్శి అభిలాష్ తెలిపారు. ఏ గ్రేడ్ టమాటా కేజి ధర రూ.160 నుంచి రూ.196 వరకు ఉండగా బీ గ్రేడ్ రూ.120 నుంచి రూ.156 వరకు ఉన్నట్లు వెల్లడిరచారు.