న్యూదిల్లీ : ఎన్నికల బాండ్లు రాజ్యాంగానికి విరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నట్లు భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ప్రధాన కార్యదర్శి డి.రాజా గురువారం అన్నారు. ఎన్నికల బాండ్ల రూపేణ సీపీఐ ఎన్నడూ నిధులు స్వీకరించలేదని తెలిపారు. ‘ముందు నుంచి దానిని వ్యతిరేకించాం. సైద్ధాంతికంగానూ ఎన్నికలపై కార్పొరేట్ల ప్రభావాన్ని వ్యతిరేకించాం. ఎన్నికలపై, ఎన్నికల బాండ్లపై కార్పొరేట్ ప్రభావాన్ని ముందు నుంచి మా పార్టీ వ్యతిరేకిస్తూనే ఉంది’ అని రాజా అన్నారు. బీజేపీతో ఆశ్రిత పెట్టుబడిదారుల బంధాన్ని బహిర్గతం చేసేందుకుగాను సుప్రీంకోర్టు ఆదేశించినట్లు ఎన్నికల బాండ్ల రూపేణ వచ్చిన విరాళాల వివరాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. గత దశాబ్దంలో బీజేపీ ఎప్పటికప్పుడు ఎన్నికల వ్యవస్థతో రాజీ పడిరదని, దానిని భ్రష్ఠు పట్టించేందుకు యత్నించిందని విమర్శించారు. స్వేచ్ఛ, పారదర్శక ఎన్నికలు, నిష్పాక్షిక ఎన్నికల కమిషన్ కోసం సీపీఐ కట్టుబడి ఉన్నట్లు రాజా స్పష్టంచేశారు. ఎన్నికల బాండ్ల పథకం ద్వారా వచ్చిన విరాళాల వివరాలను బహిర్గతం చేయాలని సీపీఐ తరపున డిమాండ్ చేశారు. ఎన్నికల బాండ్ల రూపేణ చట్టబద్ధంగా జరిగిన అవినీతి ద్వారా లబ్ధి పొందిన వారు ఎవరో ప్రజలకు తెలియాలన్నారు. ఎన్నికల బాండ్లపై నిర్ణయం తీసుకునేందుకు సుప్రీంకోర్టుకు ఏడేళ్లు పట్టడం దురదృష్టకరమని, భవిష్యత్లో ఇలాంటి జాప్యాలు జరగవని ఆకాంక్షిస్తున్నట్లు వెల్లడిరచారు. ఇంద్రజిత్ గుప్తా కమిటీ సిఫార్సుల ప్రకారం ఎన్నికలకు రాష్ట్ర నిధులు, ఎన్నికల సంస్కరణలపై విస్తృత చర్చను సుప్రీం తాజా తీర్పు ప్రభావితం చేయగలదన్న అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. ఎన్నికల ప్రక్రియను నాశనం చేసేందుకు బీజేపీ అనేక ప్రయత్నాలు చేసిందని, దాతలు, విరాళాల వివరాలు వెల్లడిరచాలని, ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తాజాగా తీర్పు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు.