అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు, పవన్ చర్చ
విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ గురువారం మరోసారి భేటీ అయ్యారు. ఎంపీ, మిగిలిన ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల్లో అనుసరించాల్సిన ఉమ్మడి ప్రచార వ్యూహంపై సుమారు గంటపాటు చర్చించుకున్నారు. టీడీపీ రెండు విడతలుగా 128 శాసనసభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మరో 16 పెండిరగులో ఉన్నాయి. అలాగే 17 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. పెండిరగులో ఉన్న శాసనసభ స్థానాలు, ఎంపీ అభ్యర్థులను నేడో రేపో వెల్లడిరచే అవకాశముంది. చంద్రబాబు ఈనెల 26 నుంచి ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు. 27వ తేదీ నుంచి వారాహి యాత్రతో ప్రచారాన్ని ప్రారంభించేలా పవన్ కల్యాణ్ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించిన 21 అసెంబ్లీ సీట్లకుగాను ఐదు స్థానాలకు అధికారికంగా, మరో 6 స్థానాలకు అనధికారికంగా అభ్యర్థులను ఖరారు చేశారు. మిగిలిన స్థానాలకు, రెండు ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. బీజేపీకి కేటాయించిన ఆరు ఎంపీ, 10 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. బీజేపీ తరపున ఏ స్థానం నుంచి ఎవరు పోటీ చేయబోతున్నారు… ఖరారైన అభ్యర్థులెవరు… తదితరాంశాలపైనా చంద్రబాబు, పవన్ చర్చించినట్లు తెలిసింది.
99 శాతం హామీల అమలు బూటకం: చంద్రబాబు
విధ్వంసాలకు, కక్షా రాజకీయాలకు, దోపిడీకి ఐదేళ్ల పదవీ కాలాన్ని వెచ్చించిన ఏకైక సీఎం జగన్ మోహన్ రెడ్డి అని చంద్రబాబు ‘ఎక్స్’లో విమర్శించారు. 99 శాతం హామీల అమలు చేశామనే జగన్ మాట బూటకం…విశ్వసనీయతపై అతని కబుర్లు అతిపెద్ద నాటకం! అని వ్యాఖ్యానించారు. ప్రజలను మరోమారు మోసం చేయడానికి జగన్ సిద్ధమయ్యారని, గత హామీలపై బదులిచ్చాకే బస్సెక్కాలంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.