కాల్పుల్లో తాలిబన్లకు గాయాలు
పలువురు మృతి
కాబూల్ : అఫ్గాన్లో తాలిబన్ల శకం మొదలు కావడం యావత్ ప్రపంచాన్ని కలవరపాటుకు గురవుతోంది. అక్కడ పరిస్థితులు శరవేగంగా మారిపోతున్నాయి. మరోవైపు నిరసనకారులు (తిరుగుబాటుదారులు) వారికి వ్యతిరే కంగా పోరాటాన్ని తీవ్రతరం చేశారు. మూడు జిల్లాలను తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో అఫ్గాన్ తిరుగుబాటుదారులు జరిపిన కాల్పుల్లో కొందరు తాలిబన్లు గాయపడ్డారు. మరికొందరు మర ణించినట్లు తెలుస్తోంది. ఖైర్ మహమ్మద్ అందార్బీ అనే వ్యక్తి నాయకత్వాన పబ్లిక్ రెసిస్టెన్స్ ఫోర్స్కి చెందిన సభ్యులు పోల్-ఏ-హెసార్, బేసలాప్ా, బాను అనే జిల్లాలను స్వాధీనపరచు కున్నారు. ఇతర జిల్లాల స్వాధీనానికి ముందుకు వెళుతున్నారు. ఇదే విషయాన్ని వారు ప్రకటించుకున్నారు. ఇదిలావుంటే, కాందహార్, హెరాత్ ప్రావిన్స్లోని భారత దౌత్య కార్యాలయాలపై తాలిబన్లు దాడులు జరపలేదని కాబూల్లోని భారత దౌత్యకార్యాలయ సిబ్బంది తెలిపారు.