వాషింగ్టన్ : సెప్టెంబరులోపు రష్యా దౌత్యవేత్తలు తమ దేశం విడిచి వెళ్లిపోవలసిందిగా అమెరికా ఆదేశాలు జారీ చేసింది. రష్యాకు చెందిన 24 మంది దౌత్యవేత్తలు వచ్చే నెల 3వ తేదీలోపు దేశం విడిచి వెళ్లాలని జాబితాను తాము అందుకున్నట్లు రష్యా రాయబారి అనటోలీ అండోనోవ్ ది నేషనల్ ఇంటరెస్ట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. వీసా గడువు ముగిసినందున వీరిని దేశం విడిచి వెళ్లాలని ఆదేశించినట్లు అమెరికా వెల్లడిరచింది. 2020 డిసెంబరులో అమెరికా`రష్యా మధ్య కుదిరిన ఒప్పందం మేరకు రష్యా దౌత్యవేత్తలు మూడేళ్లపాటు అమెరికాలో ఉండాలి..వీసా గడువు ముగియడంతో ఎవరైనా దేశం విడిచి వెళ్లిపోవడం లేదా వీసా కోసం దరఖాస్తు చేసుకోవలసి ఉంది. నాకు తెలిసినంతవరకు మూడు సంవత్సరాల కాల పరిమితి విధానం ఏ ఇతరదేశానికి వర్తించదని అంటనోవ్ అన్నారు. దీనిపై అమెరికా స్పందిస్తూ రష్యన్లకు వీసాల చెల్లుబాటుపై మూడేళ్ల పరిమితి కొత్తేమీ కాదని అన్నారు. తమ దేశ పౌరులను నియమించకుడా అమెరికాతో దౌత్యకార్యకలాపాలను పూర్తిగా నిషేధిస్తున్నట్లు ఈ ఏడాది ఏప్రిల్ నెలలో రష్యా విదేశాంగ శాఖ ప్రకటించింది. ఎన్నికల్లో రష్యన్లు జోక్య చేసుకున్నారన్న ఆరోపణలపై బైడెన్ ప్రభుత్వం ఏప్రిల్ 10 మంది రష్యన్ దౌత్యవేత్తలను బహిష్కరించంది.