Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

రైసీ మృతిపై అనుమానాలెన్నో…

లేజర్‌ బీమ్‌తో హెలికాప్టర్‌ కూల్చివేత
వారసత్వ పోరుపైనా సందేహాలు
ఇరాన్‌ వేలు అమెరికా వైపు

తెహ్రాన్‌ : బెల్‌ 212 హెలికాప్టర్‌ కూలి ఆదివారం సాయంత్రం ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణించడంపై రకరకాల ప్రచారాలు మొదలయ్యాయి. వారసత్వ పోరు కూడా రైసీ మరణం వెనుక ఉండొచ్చని ఆన్‌లైన్‌ కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. అంతేకాకుండా అత్యాధునిక లేజర్‌బీమ్‌ను అంతరిక్షం నుంచి ప్రయోగించి ఆయన హెలికాప్టర్‌ను కూల్చి వేసి ఉండొచ్చని మరికొందరు అంచనా వేస్తున్నారు. దర్యాప్తు బృందం మాత్రం ఈ ఘటనపై ఎక్కువ వివరాలు పంచుకోలేదు. ప్రస్తుతం ఇరాన్‌ సుప్రీం లీడర్‌గా అలీ ఖమేనీ వ్యవహరిస్తున్నారు. ఆయన తర్వాత రైసీ ఆ స్థానాన్ని ఆక్రమించవచ్చనే ప్రచారం నిన్నటి వరకు జరిగింది. వాస్తవానికి ఖమేనీ కుమారుడు ముజ్తబా కూడా ఈ కుర్చీ కోసం పోటీ పడుతున్న వారిలో ఉన్నారు. ఈ విషయంపై అమెరికా విదేశాంగ శాఖ మాజీ సలహాదారు గాబ్రియన్‌ నోర్నహ ఎక్స్‌లో పోస్టు చేస్తూ… రైసీ మరణంతో ఖమేనీ వారసత్వం ఆయన కుమారుడైన ముజ్తబాకు దక్కడం ఖాయమని పేర్కొన్నారు. రైసీ-ముజ్తబా మధ్య ఎప్పటి నుంచో పోటీ నెలకొందని వెల్లడిరచారు. తాజాగా ఖమేనీ ఇరాన్‌ ప్రజలను ఆందోళన చెందొద్దని చెప్పడానికి కూడా వారి అనుమానాలు దూరం చేయడానికే అనిపిస్తోందన్నారు. ప్రస్తుతం ఖమేనీ వయస్సు 85 ఏళ్లు. ఇక రైసీ స్థానంలో తాత్కాలిక బాధ్యతలు తీసుకొన్న మహమ్ముద్‌ ముఖ్‌బెర్‌ మరో 50 రోజులు ఆ పదవిలో కొనసాగనున్నారు. అంతరిక్ష లేజర్‌ ఆయుధం వాడి రైసీ హెలికాప్టర్‌ను కూల్చేసి ఉండొచ్చనే మరో ప్రచారం ఎక్స్‌లో జోరుగా జరుగుతోంది. ఇప్పటికే చాలా దేశాలు ఇటువంటి ఆయుధాలు వాడుతుండటంతో ఈ కుట్రకోణాన్ని కూడా నెటిజన్లు నమ్ముతున్నారు. మరోవైపు ఇరాన్‌ ప్రభుత్వం మాత్రం ఇటువంటి దాడి ఏదీ జరగలేదని వెల్లడిరచింది.
మరోవైపు, ఇరాన్‌ అణు శాస్త్రవేత్త మొహసీన్‌ ఫక్రిజాద హత్యలో ఇజ్రాయిల్‌ అత్యాధునిక రోబోలు వాడినట్లు తేలింది. అంతకుముందు అణు కేంద్రంలో పరికరాల ధ్వంసంలోనూ ఇజ్రాయిల్‌ ఇలాగే వ్యవహరించింది. ఈ నేపథ్యంలో తాజాగా రైసీ మరణంలోనూ అటువంటి ఆయుధాలు వినియోగించి ఉండొచ్చని భావిస్తున్నారు. విదేశాంగశాఖ మాజీ మంత్రి మహమ్మద్‌ జావెద్‌ జారిఫ్‌ మాత్రం అమెరికానే ఈ మరణానికి కారణమని పేర్కొన్నారు. తమ హెలికాప్టర్లకు అవసరమైన విడి భాగాలు కొనుగోలు చేయనీయకుండా విధించిన ఆంక్షలే అధ్యక్షుడి ప్రాణాలు బలితీసుకొన్నట్లు చెబుతున్నారు.
ఇరాన్‌ వాయు రవాణా భద్రత చరిత్ర చాలా పేలవంగా ఉన్నట్లు ఈ ఘటనతో స్పష్టమవుతోంది. దీనికి అమెరికా ఆంక్షలు కొంతవరకు కారణమని నిపుణులు చెబుతున్నారు. రైసీ ప్రయాణించిన హెలికాప్టర్‌ను 1979కు ముందు కొనుగోలు చేసినట్లు భావిస్తున్నారు. తర్వాత ఆంక్షల కారణంగా కొత్త విమానాలు, హెలికాప్టర్ల కొనుగోలు, పాత వాటికి విడిభాగాల సేకరణ కష్టమైంది. ఇరాన్‌ విమానయాన, హెలికాప్టర్‌ సంస్థలు… తమ వద్ద ఉన్న లోహవిహంగాల్లో కొన్నింటిని భాగాలుగా విడగొట్టి, మిగతావాటికి అమరుస్తున్నాయి. రివర్స్‌ ఇంజినీరింగ్‌ పద్ధతిలో కొన్ని భాగాలను ఇరాన్‌ తయారుచేస్తోంది. వాటి నాణ్యత ప్రశ్నార్థకంగానే ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img