కీవ్: ఉక్రెయిన్లోని జపొరిజ్జియా అణు విద్యుత్ కేంద్రంపై ఇటీవల డ్రోన్ దాడి జరిగిన ఘటనపై ఐక్యరాజ్యసమితి అటామిక్ వాచ్డాగ్ ఆందోళన వ్యక్తం చేసింది. తీవ్ర స్థాయిలో అణు ప్రమాదం జరిగే అవకాశం ఉన్నట్లు ఐరాస పేర్కొంది. ఆ డ్రోన్ దాడి వెనుక ఉక్రెయిన్ హస్తం ఉన్నట్లు రష్యా తెలిపింది. డ్రోన్ దాడిలో సుమారు ముగ్గురు గాయపడ్డారు. కానీ ఉక్రెయిన్ మాత్రం దీన్ని ఖండిస్తోంది. ఆరు అణు రియాక్టర్లు ఉన్న ఈ విద్యుత్ కేంద్రం ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో కీలకంగా మారింది. డ్రోన్ దాడులపై అప్రమత్తంగా ఉండాలని ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ పేర్కొంది. చాలా నిర్లక్ష్యంగా డ్రోన్ దాడి చేసినట్లు ఐఏఈఏ అధిపతి రాఫేల్ గ్రోసి తెలిపారు. అణు విద్యుత్ ప్లాంట్ వద్ద ప్రస్తుతం భద్రతాపరమైన సమస్యలు ఉత్పన్నం అవుతున్నట్లు ఆయన వెల్లడిరచారు. దక్షిణ ఉక్రెయిన్లో ఉన్న జపొరిజ్జియా ఈ అణు విద్యుత్ కేంద్రం యూరోప్లోనే పెద్దది. అయితే రష్యా`ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలైన తర్వాత దాన్ని రష్యా దళాలు ఆక్రమించేశాయి. 2022 ఫిబ్రవరి నుంచి ఆ ప్లాంట్ రష్యా ఆధీనంలోనే ఉంది. జపొరిజ్జియా వద్ద డ్రోన్ దాడి వల్ల స్వల్పంగా భౌతిక నష్టం జరిగినట్లు ఐఏఈఏ నిపుణులు వెల్లడిరచారు. ఓ రియాక్టర్ కూడా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ప్లాంట్ వద్ద రేడియేషన్ లెవల్స్ సాధారణంగానే ఉన్నాయని, భయపడాల్సినంత నష్టం జరగలేదని ప్లాంట్ సిబ్బంది చెబుతున్నారు.