తారస్థాయికి నిరుద్యోగం: ఐరాస`ఐఎల్ఓ
జెనీవా: పశ్చిమాసియా రగిలిపోతుండటంతో గాజా స్ట్రిప్ పేదరికంలో కూరుకుపోతోందని ఐక్యరాజ్య సమితి` అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేశాయి. ఇజ్రాయిల్ భీకర పోరుతో గాజా స్ట్రిప్, వెస్ట్బ్యాంక్ అస్తవ్యస్థమయ్యాయని, భవనాలు, ఇళ్లు, వాణిజ్య సముదాయాలు నేల కూలగా, ఆర్థిక కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయి పరిస్థితి మరింత దయనీయంగా మారిందని పేర్కొన్నాయి. దాదాపు 100శాతం గాజా ప్రజలు పేదరికంలో మగ్గిపోతున్నారని, ఇజ్రాయిల్ దాడులతో కరువు పరిస్థితులు తప్పబోవని ఐరాస ఆందోళన వ్యక్తం చేసింది. ఏడాదిగా కొనసాగుతున్న దురాక్రమణతో నిరుద్యోగం, పేదరికం అంచనాలకు మించిపోయినట్లు పేర్కొంది. 100 శాతం జనాభా పేదరికంలో కూరుకుపోగా నిరుద్యోగం తారస్థాయికి చేరుకుం దని తాజా నివేదిక వెల్లడిరచింది. వెస్ట్ బ్యాంక్లో నిరుదోగ్యం సగటున 35శాతంగా, గాజాలో 79.7శాతంగా నమోదైనట్లు ఐఎల్ఓ తెలిపింది. ప్రాణ నష్టమే కాకుండా మానవతా పరిస్థితులు క్షీణించి, గాజా భౌతికంగా ధ్వంసం కావడంతో ఈ పరిస్థితి దాపురించిందని ఐఎల్ఓకు అరబ్ రాష్ట్రాల ప్రాంతీయ డైరెక్టర్ రుబా జరాదత్ అన్నారు. దీని ప్రభావం భవిష్యత్ తరాలపై తీవ్రంగా ఉంటుందన్నారు. వెస్ట్బ్యాంక్ ఆర్థిక సంకో చం (ఎకనామిక్ కాంట్రాక్షన్) దాదాపు రెట్టింపు అయిందని, 2023లో 12శాతం నుంచి 28శాతానికి చేరుకుందని ఐఎల్ఓ వెల్లడిరచింది. వెస్ట్బ్యాంక్లో స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ) సంకోచం 21.7శాతం మేర ఉండగా గాజా స్ట్రిప్లో 84.7శాతంగా ఉన్నట్లు తెలిపింది. ఇజ్రాయిల్ దాడుల్లో 42,409 మంది పలస్తీనియన్లు చనిపోయారని పేర్కొంది. ఆర్థిక దీన స్థితికి తాజా గణాంకాలు అద్దం పట్టాయని, ఇళ్లు, మౌలిక వసతులన్నీ ధ్వంసం కాగా గాజాలో ఆర్థిక కార్యకలాపాల ప్రతిష్ఠంభన, ఉద్యోగులు, కార్మికుల వలసలతో పరిస్థితి మరింతగా క్షీణించిందని ఐఎల్ఓ వెల్లడిరచింది. అసంఘటిత రంగం స్తంభించిందని తెలిపింది. ద్రవ్యోల్బణం 248 శాతంగా ఉంది… కరువు కాటకాలు తప్పబోవని ఐరాస హెచ్చరించింది. మానవతా సాయాన్ని సైతం ఇజ్రాయిల్ అడ్డుకుంటడంతో పరిస్థితులు మరింత క్షీణిస్తాయని ప్రకటన వెల్లడిరచింది.