పలస్తీనా ప్రజలకు నెతన్యాహు వీడియో సందేశం
ఇరాన్ ఉగ్ర సామ్రాజ్యం కూలిపోతోందని వ్యాఖ్య
యాహ్యా సిన్వర్ను హతమార్చాం: ఇజ్రాయిల్ సైన్యం
టెల్అవీవ్: హమాస్ తమ ఆయుధాలను సమర్పించి, బందీలు అందరినీ విడుదల చేస్తే పోరు రేపే ముగుస్తుందని ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. హమాస్ అధినేత యాహ్యా సిన్వర్ను మట్టుబెట్టినట్లు ఇజ్రాయిల్ సైన్యం ప్రకటించిన కొద్ది సేపటికి గాజా ప్రజలనుద్దేశించి నెతన్యాహు ‘ఎక్స్’లో వీడియో సందేశమిచ్చారు. యాహ్యా సిన్వర్ హతమయ్యాడు. ఇజ్రాయిల్ సైనికులు అతనిని రఫాలో మట్టుబెట్టారు. గాజాలో పోరుకు ఇది ముగింపు కాబోదు. ముగింపునకు ఇది ఆరంభం మాత్రమే అవుతుంది. గాజా ప్రజలారా మీకు నేను ఒక సాదాసీదా సందేశమిస్తున్నారు. ఈ పోరు రేపటికల్లా ముగించేయవచ్చు. అందుకోసం హమాస్ లొంగిపోవాలి. బందీలను విడిచిపెట్టాలి’ అని నెతన్యాహు పేర్కొన్నారు. సిన్వర్తో పాటు మరో ఇద్దరు సాయుధులను తమ సైన్యం హతమార్చినట్లు ఇజ్రాయిల్ గురువారం ప్రకటించింది. గాజాలో 101 మంది హమాస్ వద్ద బందీగా ఉన్నారని, ఇజ్రాయిల్తో సహా 23 వేర్వేరు దేశాల పౌరులు వారిలో ఉన్నారని నెతన్యాహు వెల్లడిరచారు. బందీలందరినీ విడిచిపించి, వారిని సురక్షితంగా ఇళ్లకు చేర్చేందుకు ఇజ్రాయిల్ కట్టుబడి ఉందని వక్కాణించారు. ఇజ్రాయిలీలను బందీలుగా ఉంచిన వారికి చుక్కలు చూపిస్తామంటూ హెచ్చరించారు. బందీలకు హాని తలపెడితే ఉపేక్షించేది లేదని, వెంటాడి చంపుతామని పేర్కొన్నారు. ఇరాన్ నిర్మించిన ఉగ్ర సామ్రాజ్యం మీ కళ్ల ఎదుటే కూలిపోతోంది చూడండి అంటూ స్థానికులనుద్దేశించి నెతన్యాహు అన్నారు. హసన్ నస్రల్లా వంటి హెజ్బుల్లా కీలక నేతలను ఇజ్రాయిల్ హతమార్చిందని తన సందేశంలో ఆయన గుర్తుచేశారు. ‘నస్రల్లా, మొప్ాసెన్, హనియే, డెయిఫ్, సిన్వర్ అంతా చనిపోయారు. ఇరాక్, సిరియా, లెబనాన్, యెమన్తో పాటు తమ సొంత ప్రజలపై ఇరాన్ సాగిస్తున్న ఉగ్ర పాలన అంతానికి చేరువైంద’ని నెతన్యాహు వ్యాఖ్యానించారు. ‘శాంతి, సుసంపన్నమైన భవిష్యత్ కోరుకునేవారంతా ఏకం కావాలి… కలిసికట్టుగా చీకటిశక్తులను పారద్రోలి… ఉజ్వల భవిష్యత్కు బాటలు వేసుకుందాం, మన ఆకాంక్షలు నెరవేర్చుకుందాం’ అని పశ్చిమాసియా ప్రజలకు పిలుపునిచ్చారు. ఇదిలావుంటే తయిబే ప్రాంతానికి చెందిన హెజ్బుల్లా కమాండర్ మహమ్మద్ హసిన్ రమల్ను వైమానిక దాడుల్లో హతమార్చినట్లు ఇజ్రాయిల్ రక్షణ దళాలు ప్రకటించాయి. మరోవైపు సిన్వర్ను ప్రకటించిన తర్వాత గాజాపై విరుచుకుపడ్డాయి. 24 గంటల్లో గాజా, లెబనాన్లో జరిపిన వైమానిక దాడుల్లో 150కుపైగా ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసినట్లు ఐడీఎఫ్ తెలిపింది.