కాబూల్ స్థితిపై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన
జెనీవా : అఫ్గాన్ తాలిబన్ల వశం కావడంతో ఆ దేశంలో నిత్యం రక్తం చిందుతోంది. కాబూల్ విమానాశ్రయంలో తరచూ కాల్పులు వినిపిస్తున్నాయి. ప్రజలు ప్రాణాలు కోల్పోతు న్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశానికి వైద్య సామాగ్రి సరఫరాకు ఆటంకం కలిగిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తెలిపింది. కాబూల్ ఎయిర్పోర్టు ఆంక్షల వల్ల 500 టన్నులకుపైగా వైద్య సామాగ్రి (సర్జికల్ పరికరాలు, పౌష్టికాహార కిట్ల) సరఫరా నిలిచి నట్లు సోమవారం పేర్కొంది. తాలిబన్ రాజ్యంతో అఫ్గాన్ల జీవితాలు అస్తవ్యస్థమయ్యాయని, 300,000 మంది నిరాశ్రయులయ్యారని, వారికి వైద్యం, ఆహారం అత్యవసరమని తెలిపింది. జనాభాలో దాదాపు సగం అంటే 18.5 మిలియన్ల మంది వరకు మానవతా సాయంపై ఆధారపడుతున్నట్లు వెల్లడిరచింది. ప్రపంచ దృష్టి ప్రజల తరలింపు, విమానాలపైనే ఉందిగానీ అక్కడే మిగిలిన వారి గురించి పట్టించుకోవడం లేదని, వారికి సాయం అవసరమని డబ్ల్యూహెచ్ఓ అధికార ప్రతినిధి ఇనాస్ హమామ్ తెలిపారు. ఖాళీ విమానాలను దుబాయి, యూఏఈలోని తమ గిడ్డంకులకు మళ్లించి అక్కడ నుంచి అవసమైన వస్తువులను తీసుకొని ఆపై ప్రజలను తరలించేందుకు వెళ్లాలని కోరినట్లు చెప్పారు. అవసరార్థులకు వైద్య సామాగ్రిని చేర్చేందుకు ‘హ్యుమానిటేరియన్ ఎయిర్ బ్రిడ్జ్’ ఏర్పాటునకు డబ్ల్యూహెచ్ఓ కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు.