London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Friday, October 18, 2024
Friday, October 18, 2024

సైనిక చర్యలు ముగిశాయ్‌: ఐడీఎఫ్‌

టెల్‌అవీవ్‌: పలస్తీనా, జెనిన్‌లో ఇజ్రాయిల్‌ చేపట్టిన అతిపెద్ద మిలిటెంట్ల ఏరివేత ఆపరేషన్‌ ముగిసినట్లు ఐడీఎఫ్‌ ప్రకటించింది. ఉగ్రవాదులకు స్వర్గదామాలు ఉండకూడదన్న లక్ష్యంతో సైనిక దాడులు జరిపినట్లు ఐడీఎఫ్‌ పేర్కొంది. ప్రస్తుతం జెనిన్‌లో ఆపరేషన్‌ ముగిసినట్లు ఐడీఎఫ్‌ ప్రతినిధి డేనియల్‌ హగారి వెల్లడిరచారు. ‘జెనిన్‌ నుంచి అన్ని దళాలు తిరిగి వెళ్లిపోయాయి. లక్ష్యాలను సాధించాం’ అని పేర్కొన్నారు. దళాల ఉపసంహరణ సమయంలోనే గాజా స్ట్రిప్‌ నుంచి ఐదు రాకెట్లను ప్రయోగించగా ఇజ్రాయిల్‌ వైమానిక రక్షణ వ్యవస్థలు వాటిని అడ్డుకొన్నాయి. దీనికి ప్రతిగా బుధవారం తెల్లవారుజామున గాజాస్ట్రిప్‌పై వైమానిక దాడులను కొనసాగించారు. ఇజ్రాయిల్‌ దళాలు ఆస్పత్రుల్లోకి బాష్పవాయువును ప్రయోగించినట్లు ‘డాక్టర్స్‌ వితౌట్‌ బోర్డర్స్‌’ సంస్థ ఆరోపించింది. పలస్తీనాకు చెందిన హమాస్‌ మిలిటెంట్‌ ఒకరు ఇజ్రాయిల్‌ రాజధాని టెల్‌అవీవ్‌లో కారుతో విధ్వంసం సృష్టించాడు. ప్రజలపైకి వాహనాన్ని నడిపిన ఘటనలో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. పలస్తీనా ఉగ్రవాదులు మొత్తం ‘జెనిన్‌ బ్రిగేడ్స్‌’ పేరిట గ్రూపులుగా ఏర్పడ్డారు. పలస్తీనా దాడులకు గాజా, జెనిన్‌ స్వర్గదామాలుగా ఉన్నాయి అని ఐడీఎఫ్‌ ఆరోపించింది. ఈ గ్రూపులను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయిల్‌ దాడులు చేసింది. ఈ దాడుల్లో ఓ ఆయుధాగారం ధ్వంసమైనట్లు ఐడీఎఫ్‌ పేర్కొంది. కాగా మొత్తం ఆపరేషన్‌లో 12 మంది పలస్తీనా ప్రజలు చనిపోగా వీరిలో ఐదుగురు మిలిటెంట్లు ఉన్నట్లు సమాచారం.
జెనిన్‌పై దాడికి ఇజ్రాయిల్‌ కమ్యూనిస్టు పార్టీ ఖండన
పలస్తీనాలోని జెనిన్‌ శరణార్థ శబిరంపై ఇజ్రాయిల్‌ ఆదివారం రాత్రి సైన్యంతో దాడి చేయించింది. ఈ ఘటనలో 10 మంది పలస్తీనా ప్రజలు ప్రాణాలు కోల్పోగా 103 మంది వరకు గాయపడ్డారు. క్యాంపుపై వైమానిక దాడితో సైనిక దాడి మొదలైంది. జుడియా, సమారియాలో ఉగ్రవాద ముప్పును తొలగించేందుకు ఈ దాడి జరిపినట్లు ఐడీఎఫ్‌ అధికార ప్రతినిధి వెల్లడిరచారు. ఈ ఘటనను ఇజ్రాయిల్‌ కమ్యూనిస్టు పార్టీ (ఎంకేఐ) ప్రధాన కార్యదర్శి అడెల్‌ అమెర్‌ తీవ్రంగా ఖండిరచారు. ‘భూమిపై నుంచే కాకుండా వైమానిక దాడులు జరిపించారన్నారు. హింసను ప్రేరేపించే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. రక్తపాతాన్ని కోరుకుంటున్నట్లు వ్యాఖ్యానించారు. జెనిన్‌ను మరో గాజాగా మార్చాలని చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనలు పలస్తీనా ప్రతిస్పందనకు దారి తీస్తాయని పేర్కొన్నారు. ఇప్పటివరకు ప్రయత్నించని పరిష్కార చర్యలను చేపట్టేందుకు ఇదే సమయం అని నొక్కిచెప్పారు. పలస్తీనా, ఇజ్రాయిల్‌ ప్రయోజనాల దృష్ట్యా రక్తపాతాన్ని ముగించడమే సబబుగా ఉంటుందన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img