బ్రసీలియా: బ్రిక్స్లోకి కొత్త దేశాల చేర్పింపు కీలకమని, ప్రపంచ స్థాయిలో ఈ బ్లాక్ పోషించే పాత్ర అసాధారణంగా ఉంటుందని బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డా సిల్వా అన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆర్థిక సాయాన్ని అందించడం ద్వారా అసమానతలను రూపుమాపేందుకు దోహదం కాగలదని అభిప్రాయపడ్డారు. జొహనెస్బర్గ్లో జరగబోయే 15వ బ్రిక్స్ సదస్సుపై అంచనాలు భారీగా ఉన్నాయని చెప్పారు. సౌదీ అరేబియా, అర్జెంటైనా వంటి అభివృద్ధి చెందుతున్న పెద్ద దేశాలు బ్రిక్స్లో భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని నొక్కిచెప్పారు. బ్రిక్స్లో చేరేందుకు 40కుపైగా దేశాలు సిద్ధంగా ఉన్నట్లు దక్షిణాఫ్రికా ప్రభుత్వం వెల్లడిరచింది. కొత్త దేశాలకు సభ్యత్వం కల్పించే విషయంపై జొహనెస్బర్గ్ సదస్సులో ఏకాభిప్రాయం కుదరవచ్చని లూలా అన్నారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) కంటే సమర్థంగా, ఉదారంగా బ్రిక్స్ న్యూ డెమొక్రటిక్ బ్యాంక్ పనిచేయాలని బ్రెజిల్ అధ్యక్షుడు సూచించారు.కాగా, బ్రిక్స్ సభ్యదేశాలుగా బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా ఉండటం తెలిసిందే.