ఆస్టిన్: టెక్సాస్కు చెందిన ఇంట్యూటివ్ మెషిన్స్ కంపెనీ తయారు చేసి ప్రయోగించిన వ్యోమనౌక చంద్రుడి దక్షిణ ధృవంపై విజయవంతంగా దిగింది. దీంతో 50ఏళ్ల తర్వాత చంద్రుడిని చేరుకున్న ప్రైవేటు రంగానికి చెందిన సంస్థ చేసిన ప్రయోగం ఫలించినట్లు నాసా ప్రకటించింది. 1972లో అపోలో మిషన్ తర్వాత నాసా అధ్వర్యంలో జరిగిన చంద్రుడి యాత్ర ఇదే. గతవారమే ఇంట్యూటివ్ మెషీన్స్ ప్రైవేటు ల్యాండర్ ఒడిస్సస్తో కూడిన రాకెట్ను ప్రయోగించింది. ల్యాండర్ నుంచి వచ్చే సంకేతాలు బలహీనంగా ఉన్నాయని, వాటిని బలోపేతం చేసేందుకు యత్నిస్తున్నామని ఇంట్యూటివ్ మెషీన్స్ వెల్లడిరచింది. ల్యాండర్ చంద్రుడిపై దిగిందని తెలిపింది. అయితే ఏ ప్రాంతంలో దిగిందో మాత్రం వెల్లడిరచలేదు. ఒడిస్సస్ ప్రయోగం కోసం ఇంట్యూటివ్కు నాసా 118 మిలియన్ డాలర్ల నిధి ఇచ్చింది. రోదసీ యాత్రలను వాణిజ్యకీకరణలో భాగంగా దీన్ని చేపట్టింది. ‘మాలాపెర్ట్ ఏ’ అనే బిలానికి సమీపంలో అనువైన ప్రాంతాన్ని ఎంచుకొని ల్యాండర్ దిగి, వారం పాటు పనిచేసేలా ప్రోగ్రామ్ జరిగింది.